News July 6, 2024

VZM: చికిత్స పొందుతూ వృద్ధురాలి మృతి

image

గజపతినగరం మం. మధుపాడ జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వృద్ధురాలు చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఎస్.ఐ మహేశ్ తెలిపారు. మధుపాడకి చెందిన వేల్పూరి చిట్టెమ్మ (68) కాల కృత్యాలు తీర్చుకోవడానికి రహదారి దాటుతుండగా విజయనగరం నుంచి సాలూరు వెళ్తున్న బైక్ ఢీ కొట్టినట్లు చెప్పారు. చిట్టెమ్మ మహారాజ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు ఎస్.ఐ తెలిపారు.

Similar News

News October 11, 2024

VZM: 23న న‌ర్సింగ్ అసోసియేష‌న్‌కు ఎన్నిక‌లు

image

ఏపీ న‌ర్సింగ్ అసోసియేష‌న్ విజ‌య‌న‌గ‌రం యూనిట్‌కు ఈ నెల 23న ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఎన్నిక‌ల అధికారి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ రిజ్వాన్ ష‌రీఫ్ తెలిపారు. ఓట‌ర్ల జాబితాపై అభ్యంత‌రాల స్వీక‌ర‌ణ‌కు విజ‌య‌న‌గ‌రం ప్ర‌భుత్వ స‌ర్వ‌జ‌న ఆసుప‌త్రి, జిల్లా వైద్యారోగ్య‌శాఖ కార్యాల‌య నోటీసు బోర్డులో వివ‌రాల‌ను ఉంచిన‌ట్లు వెల్లగించారు. ఇప్ప‌టికే ఎన్నిక‌ల‌పై అందరికి అవ‌గాహ‌న క‌ల్పించామ‌న్నారు.

News October 10, 2024

చంద్రబాబును పైడితల్లి ఉత్సవాలకు ఆహ్వానించిన ఎంపీ కలిశెట్టి

image

అక్టోబర్ 13, 14, 15 తేదీల్లో విజయనగరంలో జరగనున్న ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి తొల్లేళ్లు, సినిమానోత్సవం నిర్వహించనున్నారు. కాగా ఉత్సవాలకు రావాలని సీఎం చంద్రబాబుకు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆహ్వానించారు. వారితో పాటు ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు ఉన్నారు.

News October 10, 2024

దుర్గాదేవి అవతారంలో పైడితల్లి అమ్మవారు

image

ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం విజయనగరం వాసుల ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి దుర్గాదేవి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. రైల్వే స్టేషన్ వద్ద గల అమ్మవారి వనం గుడిలో దుర్గాష్టమి అర్చకులు దుర్గాదేవి అవతారంలో అమ్మవారిని అలంకరించి విశేష పూజలు, అర్చనలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.