News November 16, 2024

VZM: ‘జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలి’

image

వచ్చే నెల 14న జరగబోయే జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి మీనా దేవి కోరారు. శుక్రవారం తన ఛాంబర్‌లో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు, ఇన్సూరెన్స్ కంపెనీ న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. ఇన్సూరెన్స్ కంపెనీకి చెందిన కేసులన్నీ లోక్ అదాలతో పరిష్కరించు కోవాలన్నారు. దీనికి లోక్ అదాలత్‌ను వేదికగా చేసుకుని కక్షిదారులకు డబ్బు, సమయం వృథా కాకుండా చూడాలన్నారు.

Similar News

News September 14, 2025

17న జిల్లా బంద్‌కు పిలుపునిచ్చిన కార్మిక సంఘాలు

image

ఈనెల 17న రాష్ట్ర కార్మిక సంఘాల పిలుపుమేరకు జిల్లా బంద్ చేపడతామని కార్మిక సంఘ నాయకులు తెలిపారు. శనివారం చీపురుపల్లిలో బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు. ఫ్రీ బస్సుతో రోడ్డున పడ్డ ఆటో, టాక్సీ డ్రైవర్లకు రూ.25 వేలు ఆర్థిక భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. ఆర్టీవో వేధింపులు, ప్రైవేట్ ఫిట్నెస్ సెంటర్లను రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గరివిడి, చీపురుపల్లి, మెరకముడిదం, రాజాం డ్రైవర్లు పాల్గొన్నారు.

News September 14, 2025

VZM: ‘గాలికుంటు వ్యాధిని నిరోధించండి’

image

విజయనగరం జిల్లాలో గాలికుంటు వ్యాధిని నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఆదేశించారు. ఈనెల 15 నుంచి అక్టోబర్ 15 వరకు నిర్వహించే గాలికుంటు వ్యాధి నిరోధక టీకా కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికలను తన చాంబర్లో శనివారం కలెక్టర్ ఆవిష్కరించారు. జాతీయ పశువ్యాధి నియంత్రణ పథకంలో భాగంగా నెలరోజులపాటు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలను పశువులకు వేయడం ద్వారా వ్యాధిని నియంత్రించవచ్చన్నారు.

News September 13, 2025

VZM: ‘షరతులు లేకుండా వాహన మిత్ర అమలు చేయాలి’

image

వాహన మిత్ర సంక్షేమ పథకంలో ఎలాంటి షరతులు లేకుండా ఆటో, మ్యాక్సీ, టాక్సీ, జీపు, టాటా మ్యాజిక్ డ్రైవర్లందరికీ అమలు చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ డిమాండ్ చేశారు. విజయనగరంలోని బుచ్చన్న కోనేరు వద్ద కార్మికులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. నెలకు 5వేల పింఛన్‌తో కూడిన సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.