News September 11, 2025
VZM: జిల్లాకి చేరుకున్న 39 మంది యాత్రికులు

మానస సరోవర యాత్రకు వెళ్లి నేపాల్లో చిక్కుపోయిన జిల్లాకు చెందిన యాత్రికుల్లో 39 మంది గురువారం క్షేమంగా చేరుకున్నారు. వీరికి విశాఖ విమానాశ్రయం వద్ద ఎంపీ భరత్, ఎమ్మెల్యేలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, కోళ్ల లలిత కుమారి, బేబీ నాయన స్వాగతం పలికి వారి యోగక్షేమాలను విచారించారు. తమ స్వస్థలాలు చేరుకునేందుకు రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ డి.మణికుమార్ ఏర్పాట్లు చేశారు.
Similar News
News September 12, 2025
VZM: ‘17 నుంచి సర్వికల్ కేన్సర్ పై అవగాహన కార్యక్రమాలు’

విజయనగరం జిల్లాలో సర్వికల్ కేన్సర్ అవేర్నెస్ కార్యక్రమాన్ని ఈనెల 17 నుంచి 2 వారాల పాటు నిర్వహించబోతున్నామని DMHO జీవనరాణి గురువారం తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, మహిళా శిశు సంక్షేమ కేంద్రాల్లో స్క్రీనింగ్, అవగాహన కార్యక్రమాలు జరుగుతాయన్నారు. మహిళల ఆరోగ్య రక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలని కోరారు.
News September 11, 2025
VZM: నేలబావిలో పడి వ్యక్తి మృతి

విజయనగరం మండలం రాకొడు గ్రామానికి చెందిన పి.రామారావు (35) ప్రమాదవశాత్తు నేలబావిలో పడి గురువారం మృతి చెందాడు. పశువుల మేతకు గడ్డి కోసం వెళ్లి నేలబావిలో జారి పడినట్లు మృతుని భార్య సంధ్య పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు విజయనగరం రూరల్ ఎస్ఐ వి.అశోక్ కుమార్ తెలిపారు.
News September 11, 2025
విజయనగరం కలెక్టర్గా రామసుందర్ రెడ్డి

రాష్ట్రంలో 12 మంది కలెక్టర్లు బదిలీ అయ్యారు. ఇందులో భాగంగా విజయనగరం కలెక్టర్ డా.బీఆర్.అంబేడ్కర్ను ట్రాన్స్ఫర్ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో రామసుందర్ రెడ్డి నియమితులయ్యారు. ఈయన కమిషనర్, రిహాబిలేషన్ & రీసెటిల్మెంట్ అండ్ కమిషనర్ (సీఏడీఏ) నుంచి బదిలీపై వస్తున్నారు.