News March 30, 2025

VZM: జిల్లాలో నేడు అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

image

జిల్లాలో భానుడు భగభగమంటున్నాడు. శనివారం గుర్లలో 42.1°C నమోదైంది. ఇవాళ కూడా జిల్లా వ్యాప్తంగా వడగాలులు, ఉష్ణోగ్రతలు అధికంగా ఉండనున్నాయి. బాడంగి, బొబ్బిలి, బొండపల్లి, చీపురుపల్లి, దత్తిరాజేరు, గజపతినగరం, గంట్యాడ, గరివిడి, గుర్ల, జామి, కొత్తవలస, ఎల్.కోట, మెంటాడ, మెరకముడిదాం, నెల్లిమర్ల, రాజాం, రామభద్రపురం, రేగిడి, ఎస్.కోట, తెర్లాం, వంగర మండలాల్లో దాదాపు 40°C నమోదవుతుందని APSDMA హెచ్చరించింది.

Similar News

News April 1, 2025

భీమిలి బీచ్‌లో విజయనగరం వాసి మృతి

image

భీమిలి బీచ్‌లో విజయనగరం జిల్లా వాసి సోమవారం మృతి చెందారు. గజపతినగరం ప్రాంతానికి చెందిన పరదేశి(37) భీమిలీ బీచ్‌లో స్నానానికి వచ్చాడు. స్నానం చేసిన అనంతరం ఒడ్డుపై కూర్చొని ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్ని భీమిలి ఆసుపత్రికి తరలించారు.

News April 1, 2025

మాజీమంత్రి సుజయ కృష్ణరంగారావును కలిసిన వైసీపీ కౌన్సిలర్లు

image

మాజీమంత్రి సుజయ కృష్ణరంగారావును వైసీపీ అసమ్మతి కౌన్సిలర్లు విశాఖలోని సోమవారం కలిశారు. మున్సిపల్ ఛైర్మన్ సావు మురళీ అభివృద్ధిలో పూర్తిగా విఫలమయ్యారని, ఎమ్మెల్యే బేబినాయన చేస్తున్న అభివృద్ధికి సహకరించడం లేదని సుజయ కృష్ణరంగారావుకు తెలిపారు. అభివృద్ధి చేయడంలో విఫలం కావడంతో అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధమైట్లు వివరించారు. వైసీపీ మద్దతుతో ఛైర్మన్ పదవి కైవసం చేసుకుంటామని మాజీమంత్రి చెప్పారు.

News April 1, 2025

VZM: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

image

విజయనగరం రైల్వే స్టేషన్‌లో రైలు నుంచి కాలుజారి పడటంతో పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఛత్రిభాను(46) మృతి చెందినట్లు రైల్వే ఎస్ఐ బాలాజీరావు చెప్పారు. దిబ్రుగర్ నుంచి కన్యాకుమారి వెళ్తున్న రైలులో ప్రయాణం చేస్తున్న భాను విజయనగరం స్టేషన్‌లో వాటర్ కోసం దిగాడు. ఇంతలోనే రైలు కదలండంతో రైలులోకి ఎక్కుతుండగా కాలుజారి కిందపడి మృతి చెందిడని SI తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మహారాజు ఆసుపత్రికి తరలించామన్నారు.

error: Content is protected !!