News December 16, 2024

VZM: జిల్లాలో రేపు ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ క‌మిష‌న్ పర్యటన

image

ఎస్సీ ఉప‌కులాల‌ వ‌ర్గీక‌ర‌ణపై ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన రాజీవ్ రంజ‌న్ మిశ్రా క‌మిష‌న్ మంగ‌ళ‌వారం జిల్లాలో ప‌ర్య‌టించ‌నుంది. ఈ ఏక‌స‌భ్య‌ క‌మిష‌న్‌ ఉద‌యం 11.గంట‌ల‌కు జిల్లాకు చేరుకొని, క‌లెక్ట‌రేట్‌లో అధికారుల‌తో స‌మావేశం అవుతారు. అనంత‌రం ఎస్సీ ఉప‌కులాల‌ వ‌ర్గీక‌ర‌ణపై ప్ర‌జ‌ల‌నుంచి వారి సమస్యలను విన‌తుల రూపంలో స్వీక‌రిస్తార‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ బి.ఆర్ అంబేడ్కర్ తెలిపారు. 

Similar News

News March 1, 2026

VZM: ఉదయాన్నే ప్రమాదం.. వ్యక్తి మృతి

image

రామభద్రపురం మండలం బూసాయవలస(ముచర్ల వలస) గ్రామ సమీపంలో సాయి కృష్ణ ఆగ్రో కోల్డ్ స్టోరేజ్ దగ్గర ఆదివారం ఉదయం ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్ధుడు మృతి చెందాడు. ఇతని వయసు సుమారు 65 ఏళ్లు ఉండవచ్చని భావిస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీస్‌లు దర్యాప్తు చేస్తున్నారు.

News March 1, 2026

43 మందికి రూ.4.30 లక్షల జరిమానా: VZM SP

image

మద్యం తాగి వాహనాలు నడిపిన 43 మంది వాహనదారులపై కేసులు నమోదు చేసి, ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.4.30 లక్షల జరిమానా విధించినట్లు SP దామోదర్ శనివారం తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి నిందితులను మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా జరిమానా విధించబడిందన్నారు. గడిచిన 3 నెలల్లో మద్యం మత్తులో వాహనాలు నడిపిన సుమారు 110 మందికి జైలు శిక్ష పడిందని విజయనగరం ఎస్పీ వెల్లడించారు.

News February 28, 2026

జిల్లాలో 15 శాతం వృద్ధి రేటు సాధించే దిశగా ప్రణాళికలు: కలెక్టర్

image

విజయనగరం జిల్లాలో 15% వృద్ధి రేటు సాధించే దిశగా ప్రణాళికలు రూపొందించామని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. రావివలసలో నిర్వహించిన ప్రజావేదికలో ఆయన మాట్లాడారు. 3,280 ఎకరాల్లో ఉద్యాన సాగు విస్తరణ జరిగిందని, రబీ-ఖరీఫ్‌లలో మరింత సాగు పెంపు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విశాఖ ఎకనమిక్ రీజియన్‌లో భాగంగా ఫుడ్ పార్కులు, ఐటీ పార్కులు, ఎంఎస్‌ఎంఈ పార్కుల కోసం భూములు గుర్తించినట్లు వివరించారు.