News June 24, 2024

VZM: జిల్లాలో 308 మందికి చలానాలు

image

జిల్లా వ్యాప్తంగా ఎస్పీ దీపికా పాటిల్ ఆదేశాల మేరకు గడిచిన 24 గంటల్లో పోలీసులు విస్తృత వాహన తనిఖీలు నిర్వహించారు. చేపట్టిన దాడుల వివరాలను సోమవారం వెల్లడించారు. MV నిబంధనలు అతిక్రమించిన 308 మందిపై రూ.58,575 ఈ-చలానాలు విధించామన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై 18 కేసులు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన మరో 35 మందిపై జిల్లా వ్యాప్తంగా కేసులు నమోదయ్యాయన్నారు.

Similar News

News October 6, 2024

VZM: నేడు జిల్లాకు మంత్రి కొండపల్లి రాక

image

రాష్ట్ర చిన్న మధ్యతరహా పరిశ్రమలు, ఎన్.ఆర్.ఐ.వ్యవహారాలు, సెర్ప్ శాఖల మంత్రి శ్రీ కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం జిల్లాకు వస్తున్నారు. మంత్రి ఉదయం 4.45 గంటలకు ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో నగరానికి చేరుకొంటారు. అనంతరం స్థానికంగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని జిల్లా సమాచార పౌరసంబంధాల అధికారి తెలిపారు. గజపతినగరం నియోజకవర్గంలో పర్యటిస్తారని వెల్లడించారు.

News October 6, 2024

విజయనగరం: TODAY TOP HEAD LINES

image

✮పార్వతీపురం: అర్ధరాత్రి ఏనుగుల గుంపు హల్‌చల్
✮విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యల పరిష్కారానికి చర్యలు: కేంద్రమంత్రి
✮విజయనగరంలో ఈ నెల 8న జాబ్ మేళా
✮విజయనగరం: మాన్సాస్ ఆక్రమణల తొలగింపు
✮కురుపాం: ఆత్మహత్యాయత్నానికి కారణం భర్త అక్రమ సంబంధమే!
✮పెదపథంలో ఆరోగ్య ఉపకేంద్రం శంకుస్థాపన చేసిన మంత్రి సంధ్యారాణి
✮విశాఖ బీచ్‌లో నల్లటి ఇసుక వెనుక కారణం ఇదే..!
✮VZM: ప్రశాంతంగా ముగిసిన టెట్ పరీక్షలు

News October 6, 2024

న్యూతిన్ సూకియా, SMVT రైళ్లకు కొత్తవలసలో హాల్ట్

image

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని రైలు నంబర్స్ 05952 /05951 న్యూతిన్ సూకియా నుంచి ఎస్.ఎం.వి.టి బెంగళూరు ఈ నెల 7న, డిసెంబర్ 26 వరకు ప్రతి గురువారం సాయంత్రం 6.45 న్యూటిన్ సూకియాలో బయలుదేరి కొత్తవలస శనివారం మధ్యాహ్నం 2.05 చేరుతుందన్నారు. తిరుగు ప్రయాణంలో ఎస్.ఎం.వీ.టీ. బెంగళూరులో ఈనెల 11న, డిసెంబర్ 30 వరకు ప్రతి ఆదివారం అర్ధరాత్రి 00.30 బయలుదేరి సోమవారం రాత్రి 10.20 కొత్తవలస చేరుతుందని తెలిపారు.