News August 27, 2024
VZM: జిల్లాలో 39,972 మెట్రిక్ టన్నుల ఇసుక సరఫరా

జిల్లాలో ఉచిత ఇసుక సరఫరా విధానం ప్రారంభించిన జులై 8 నుంచి 26వ తేదీ వరకు మూడు ఇసుక డిపోల ద్వారా 39,972 మెట్రిక్ టన్నుల ఇసుక సరఫరా చేసినట్లు గనుల శాఖ ఉప సంచాలకులు సిహెచ్. సూర్యచంద్ర రావు తెలిపారు. సోమవారం ఒక్క రోజులో 30 బుకింగ్లు ద్వారా 449 మెట్రిక్ టన్నుల ఇసుక సరఫరా చేశారని పేర్కొన్నారు. నేటికీ జిల్లాలో 47,107 టన్నులు అందుబాటులో ఉందని వెల్లడించారు.
Similar News
News December 19, 2025
VZM: ఘనంగా వాజ్పాయ్ విగ్రహావిష్కరణ

భారత రత్న, మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్పాయ్ కాంస్య విగ్రహాన్ని వీటీ అగ్రహారంలోని వై జంక్షన్ వద్ద రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ శుక్రవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసుల నాయుడు, ఎమ్మెల్యేలు కిమిడి కళావెంకటరావు, పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు తదితరులు పాల్గొన్నారు.
News December 19, 2025
విజయనగరం ఎస్పీ దామోదర్కు అవార్డు

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రకాశం జిల్లా మాజీ MPP వీరయ్య చౌదరి హత్య కేసును సమర్థవంతంగా ఛేదించినందుకు విజయనగరం జిల్లా ఎస్పీ దామోదర్ (అప్పటి ప్రకాశం జిల్లా ఎస్పీ) ABCD – Award for Best in Crime Detection అవార్డు అందుకున్నారు. రాష్ట్ర DGP కార్యాలయంలో డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా శుక్రవారం ఈ అవార్డు ప్రదానం చేశారు. ఈ కేసులో 60 క్రైమ్ టీములు ఏర్పాటు చేసిన ఎస్పీ 9 మందిని అదుపులోకి తీసుకున్నారు.
News December 19, 2025
VZM: రైతుల ఖాతాల్లో రూ.373 కోట్ల జమ

ఖరీఫ్ 2025-26లో జిల్లాలో 359 RSKల ద్వారా 37,800 రైతుల నుంచి 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, రూ.373 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు జిల్లా మేనేజర్ బి.శాంతి శుక్రవారం తెలిపారు. అదనపు కిలోలు డిమాండ్ చేసిన పలు రైస్ మిల్లులకు నోటీసులు జారీ చేసి, తూకంలో మోసాలు జరగకుండా నిరంతర పర్యవేక్షణ చేస్తున్నట్లు చెప్పారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తి పారదర్శకంగా అమలు చేస్తున్నామన్నారు.


