News March 6, 2025

VZM: జిల్లా జడ్జిలతో ప్రధాన న్యాయమూర్తి సమావేశం

image

పట్టణంలోని స్థానిక జిల్లా కోర్టులో జడ్జిలతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణ్ చక్రవర్తి గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 8న జరగనున్న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. రాజీకు వచ్చే క్రిమినల్, మోటార్, ప్రమాద బీమా, బ్యాంక్, చెక్ బౌన్స్, తదితర కేసులను ఇరు పార్టీల సమక్షంలో పరిష్కరించలన్నారు.

Similar News

News March 6, 2025

విజయనగరం: ‘లెక్కలు పరీక్షకు 999 మంది గైర్హాజరు

image

విజయనగరం జిల్లాలో 66 కేంద్రాల్లో గురువారం జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం లెక్కలు పరీక్షకు 999 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారని ఆర్‌ఐ‌వోఎం ఆదినారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా లెక్కలు పరీక్షకు 23,044 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా వారిలో 22,045 మంది మాత్రమే హాజరయ్యారని పరీక్ష ఏటువంటి అవాంచనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగా జరిగిందని తెలిపారు.

News March 6, 2025

VZM: ఈ నెల 8 నుంచి 18 వరకు పి-4 సర్వే

image

పబ్లిక్ ప్రైవేటు పీపుల్స్ పార్టిసిపేషన్‌( పి-4) సర్వే ఈ నెల 8 నుంచి 18 వరకు జరుగుతుందని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పి-4 సర్వే పై అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. స్వర్ణాంధ్ర సాధనకు 10 సూత్రాలను ప్రభుత్వం అమలు చేస్తోందని, ప్రధానంగా జీరో పేదరికం లక్ష్యంలో భాగంగా ప్రభుత్వం పి-4 కార్యక్రమం చేపడుతోందని కలెక్టర్ తెలిపారు.

News March 6, 2025

VZM: మొత్తం 308 దరఖాస్తులు.. మరికాసేపట్లో ప్రారంభం!

image

విజయనగరం జిల్లాలో కళ్లు గీత, సొండి, శెట్టి బలిజ, శ్రీ సైన, యాత, సెగిడి సామాజిక వర్గాలకు 16 మద్యం దుకాణాలను ప్రభుత్వం కేటాయించింది. దీని కోసం ఆయా సామాజిక వర్గాల నుంచి మొత్తం 308 దరఖాస్తులు వచ్చాయి. కలెక్టరేట్‌లో గురువారం ఉదయం 9 గంటల నుంచి లాటరీ ప్రక్రియ ప్రారంభం కానుంది.గత నెల 10న లాటరీ తీయాల్సి ఉన్నప్పటికీ ఎన్నికల కోడ్ కారణంగా ఆ ప్రక్రియ నిలిచింది. అదృష్టవంతులెవరో మరికాసేపట్లో తేలిపోనుంది.

error: Content is protected !!