News October 16, 2024

VZM: డయేరియా మరణాలపై సీఎం ఆరా

image

గుర్లలో డయేరియాతో ఐదుగురు మృతి చెందడంపై సీఎం నారా చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మంగళవారం ఒక్కరోజే నలుగురు మృతి చెందారన్న సమాచారంపై సీఎం ఆరా తీశారు. ప్రస్తుతం బాధితులకు అందుతున్న చికిత్స, వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

Similar News

News October 16, 2024

విశాఖకు తలమానికంగా అల్లూరి సీతారామరాజు ఎయిర్‌పోర్ట్: MP

image

విశాఖపట్నానికి తలమానికంగా అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం నిలవబోతోందని విశాఖ ఎంపీ శ్రీ భరత్ అన్నారు. భోగాపురంలో విమానాశ్రయం వద్ద GMR సంస్థ ప్రతినిధులతో బుధవారం భేటీ అయ్యారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. వచ్చే 50ఏళ్లను దృష్టిలో పెట్టుకుని విమానాశ్రయ నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. విశాఖ నుంచి భోగాపురం విమానాశ్రయానికి రాకపోకలు సులభతరం చేయడానికి అవసరమైన మార్గాల అభివృద్ధిపై చర్చించామని చెప్పారు.

News October 16, 2024

VZM: పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఎంపీ

image

ఢిల్లీలో జరిగిన మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్, కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్బంగా జరిగిన ఎగ్జామినేషన్ ఆఫ్ డిమాండ్ ఫర్ గ్రాండ్స్ 2024-25 సమావేశంలో స్టాండింగ్ కమిటీ సభ్యులతో కలిసి ఎంపీ పలు సూచనలు, సలహాలు అందజేశారు.

News October 16, 2024

గుర్లలో కోరలు చాచిన డయేరియా

image

విజయనగరం జిల్లా గుర్ల మండల కేంద్రంలో డయేరియా కోరలు చాచింది. రెండు రోజుల వ్యవధిలో ఐదుగురు మ్యత్యవాత పడ్డారు. బుధవారానికి డయేరియా కేసులు మరిన్ని పెరిగాయి. స్థానిక ఉన్నత పాఠశాలలో161 మందికి చికిత్స అందిస్తున్నారు. కలుషిత నీరు తాగడం వల్లే డయేరియా ప్రబలిందని బాధితులు చెబుతున్నారు. నెల్లిమర్ల సీహెచ్సీ, విజయనగరం పెద్ద ఆసుపత్రి, గోషాలో డయేరియా రోగులు చికిత్స పొందుతున్నారు.