News September 23, 2024

VZM: దేవాలయాల్లో ప్రసాదాల తయారీకి టెండర్లు ఇలా..

image

దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని విజయనగరం పైడిమాంబ, రామతీర్థం రామస్వామి ఈ రెండు ప్రధాన ఆలయాలు ఉన్నాయి. ఆయా దేవాలయాల్లో ప్రసాదాల తయారీకి అవసరమైన సామగ్రిని పంపిణీ చేసేందుకు ఏడాదికి ఒక సారి టెండర్లు నిర్వహిస్తుంటారు. ఎవరైతే తక్కువ ధరకు వస్తువులు పంపిణీ చేస్తామని కోట్ చేస్తారో వాళ్లకే టెండర్ దక్కుతుంది. ఇది ఏళ్ల కాలం నుంచి జరుగుతున్న ప్రక్రియ అని సంబంధిత అధికారులు చెబుతున్నారు.

Similar News

News October 12, 2024

ఉమ్మడి జిల్లాలో 6,426 దరఖాస్తులు

image

ఉమ్మడి విజయనగరం జిల్లాలో కొత్త షాప్‌ల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణలో కిక్కు ఎక్కించే ఉమ్మడి జిల్లాలో ఊహించని రీతిలో దరఖాస్తులు వచ్చాయి. ఉమ్మడి జిల్లాలో 205 షాప్‌లకి 6,426 దరఖాస్తులు దాఖలు రాగా రూ.128.52 కోట్లు ఆదాయం వచ్చింది. ఇందులో పార్వతీపురంలో 52 షాప్‌లకు 1,376 దరఖాస్తులకు రూ.27.52 కోట్లు ఆదాయం వచ్చింది. విజయనగరం జిల్లాలో 153 షాప్‌లకి 5,050 దరఖాస్తులు రాగా రూ.101 కోట్లు ఆదాయం వచ్చింది.

News October 12, 2024

పార్వతీపురంలో రైలు ఢీకొని కానిస్టేబుల్ మృతి

image

రైలు ఢీకొని కానిస్టేబుల్ మృతి చెందిన సంఘటన పార్వతీపురం పట్టణ రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. జీఆర్పీ ఎస్ఐ బాలాజీ తెలిపిన వివరాలు ప్రకారం.. పార్వతీపురం పట్టణ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న జీ మల్లేశ్వరరావు (37) పట్టణ సమీపంలో ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.

News October 12, 2024

VZM: చివరి నిమిషంలో పరుగులు తీసిన ప్రయాణికులు

image

కొత్తవలస రైల్వే స్టేషన్‌లో శుక్రవారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. దసరా నేపథ్యంలో స్పెషల్ ట్రైన్లు వేసిన సంగతి తెలిసిందే. విశాఖ నుంచి అరకు వెళ్లాల్సిన ప్రత్యేక రైలుకు మచిలీపట్నం టూ విశాఖ బోర్డు ఉండడంతో ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు. తాము ఎక్కాల్సిన ట్రైన్ కాదనుకొని వేచి చూస్తుండగా ప్లాట్ ఫామ్‌పై వ్యాపారాలు చేస్తున్న వారు అరకు రైలు అని చెప్పడంతో ట్రైన్ ఎక్కేందుకు పరుగులు తీశారు.