News March 3, 2025

VZM: నేటి నుంచి ఇంటర్ సెకిండియర్ పరీక్షలు

image

నేటి నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి. విజయనగరం జిల్లాలో 177 అన్ని యాజమాన్య కళాశాలల నుంచి 20,368 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. జిల్లా వ్యాప్తంగా 166 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు శనివారం ప్రారంభం అయ్యాయి. 

Similar News

News March 3, 2025

హత్యాచారయత్నం ఘటనలో నిందితుడికి పదేళ్ల జైలు: SP

image

బొండపల్లి పోలీస్ స్టేషన్‌లో 2020లో నమోదైన వరకట్న వేధింపుల కేసులో నిందితుడు తవిటయ్యకు పదేళ్ల జైలు శిక్ష, రూ.2,500 జరిమానాను కోర్టు విధించిందని ఎస్పీ వకుల్ జిందాల్ సోమవారం తెలిపారు. చంద్రంపేటకు చెందిన తవిటయ్య అదనపు కట్నం తేవాలని వేధిస్తుండేవాడని, ఈ క్రమంలో కన్నవారి ఇంటి వద్ద ఉన్న భార్య, ఇతర కుటుంబ సభ్యులు నిద్రిస్తుండగా పాకకు నిప్పు పెట్టి హత్యాయత్నానికి పాల్పడడంతో అప్పట్లో కేసు నమోదైందన్నారు.

News March 3, 2025

MLC కౌంటింగ్.. ఎలిమినేట్ అవుతున్న అభ్యర్థులు

image

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో తక్కువ ఓట్లు పోలైన అభ్యర్థులు ఎలిమినేట్ అవుతున్నారు. 6వ రౌండ్ పూర్తయ్యేసరికి ఐదుగురు అభ్యర్థులను ఎలిమినేట్ చేశారు. ఇంకా ఐదుగురు అభ్యర్థులు మిగిలి ఉన్నారు. ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన అభ్యర్థులలో పి.శివ ప్రసాద్, ఎస్‌ఎస్.పద్మావతి, డాక్టర్ కే.రాధాకృష్ణ, ఆర్.సత్యనారాయణ, డాక్టర్ ఎస్.శ్రీనివాసరావు ఉన్నారు. కాగా ‘గాదె’ ముందంజలో కొనసాగుతున్నారు.

News March 3, 2025

VZM: గెలుపు దిశగా గాదె.. దేనికి సంకేతం?

image

ఉపాధ్యాయ MLC ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి గాదె శ్రీనివాసులనాయుడు గెలుపు దిశగా పయనిస్తున్నారు. మాజీ MLC రఘువర్మకు కూటమి మద్దతు పలికింది. ఆ దిశగా అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రజా ప్రతినిధులు రఘువర్మను గెలిపించాలని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఆయనను కాదని గాదెకే గురువులు పట్టం కట్టారనేది లెక్కింపులో స్పష్టమవుతుంది. సమస్యల పరిష్కారానికై ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారని పలువురు భావిస్తున్నారు.

error: Content is protected !!