News December 15, 2024

VZM: పొట్టి శ్రీరాములకు నివాళి అర్పించిన మంత్రి

image

అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతి సందర్భంగా ఆదివారం విజయనగరం కలెక్టర్ అడిటోరియంలో ఆయన చిత్ర పటానికి ఘననివాళి అర్పించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పొట్టి శ్రీరాములు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి వేరు చేసి తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఆయన చేసిన కృషి మరువలేనిది అని కొనియాడారు. ఆయన చూపిన బాటలో అందరూ కలసి ముందుకు సాగాలని తెలిపారు.

Similar News

News February 5, 2025

రాయగడ డివిజన్ పరిధిలో రైల్వే లైన్లు ఇవే

image

రాయగడ <<15366937>>డివిజన్<<>> పరిధిలోని రైల్వే లైన్ల వివరాలను రైల్వే శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజీవ్ కుమార్ వెల్లడించారు. బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
➤ కొత్తవలస- బచేలి/ కిరండోల్
➤ కూనేరు-తెరువలి జంక్షన్
➤ సింగ్ పూర్ రోడ్-కొరాపుట్ జంక్షన్
➤ పర్లాకిముండి- -గుణపూర్
రైల్వే స్టేషన్ ను రాయగడ రైల్వే డివిజన్ పరిధిలోకి చేర్చారు.

News February 5, 2025

మంత్రి కొండపల్లితో ఈ-వెహికల్ సంస్థ ప్రతినిధులు భేటీ

image

విజయవాడ ఏపీ సచివాలయంలోని తన ఛాంబర్‌లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ను ఈ-వెహికల్ సంస్థ ప్రతినిధులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు, అందిస్తున్న ప్రోత్సాహకాలను మంత్రి వారికి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ వాహనాలను ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో పలు కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయన్నారు.

News February 5, 2025

ఈ నెల 8న కొత్తవలసకు మాజీ ఉపరాష్ట్రపతి

image

కొత్తవలస మండలంలోని చింతలపాలెంలో ఈ నెల 8న మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటించనున్నారు. భీష్మ ఏకాదశి పర్వదినం పురష్కరించుకుని చిట్టిపాప తీర్ధ మహోత్సవం సందర్భంగా జరగనున్న సాహిత్యగోష్టికి వెంకయ్యనాయుడు హాజరవుతారని సర్పంచ్ సీతారామపాత్రుడు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలను తిలకిస్తారని చెప్పారు.

error: Content is protected !!