News March 1, 2026
VZM: ప్రశాంతంగా జిల్లా గురుకుల ప్రవేశ పరీక్ష

విజయనగరం జిల్లాలో డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని ఉమ్మడి జిల్లా సమన్వయ కర్త ఎం.మాణిక్యం తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 5వ తరగతి ప్రవేశ పరీక్షకు 1309 మందికి 1116 మంది హాజరు కాగా 193 మంది గైర్హాజరు అయ్యారన్నారు. ఇంటర్ జనరల్ పరీక్షకు 1433 మందికి 1292 మంది హాజరు కాగా.. 141మంది గైర్హాజరు అయ్యారని, ఐఐటీ-నీట్ పరీక్షకు 856 మంది హాజరయ్యారన్నారు.
Similar News
News March 2, 2026
ములుగు ప్రజావాణిలో 59 వినతులు

ములుగు కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో బాధితుల నుంచి 59 వినతులు అందాయి. వీటిలో భూ సమస్యలపై 14, ఇందిరమ్మ ఇళ్ల కోసం 14, పింఛన్ల కోసం 14, ఉద్యోగ కల్పనకు 4, ఇతర సమస్యలపై 13 దరఖాస్తులు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి దరఖాస్తును అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీలను ఎట్టి పరిస్థితుల్లోనూ పెండింగ్లో ఉంచకూడదన్నారు.
News March 2, 2026
KMR: రాహుల్ గాంధీ మూటల కోసం వచ్చారు: కేంద్ర మంత్రి

రాహుల్ గాంధీ శిక్షణా తరగతుల పేరుతో హైదరాబాద్కు వచ్చింది కేవలం మూటల కోసమేనని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. కామారెడ్డిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మూసీ సుందరీకరణ కోసం ఇండ్లను కూల్చివేసిన బాధితుల ఇండ్ల వద్దకు రాహుల్ గాంధీ వెళ్లాలని కోరుతున్నట్లు ఆయన చెప్పారు. హిందూ దేవాలయాలపై జరిగిన దాడుల ప్రాంతాలను, ఖమ్మంలోని ప్రాంతాలను సందర్శించాలన్నారు.
News March 2, 2026
ప్రశాంతంగా ముగిసిన ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ పరీక్ష

జిల్లావ్యాప్తంగా సోమవారం జరిగిన ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ పరీక్షలు శాంతియుతంగా ముగిశాయని DEO ఎన్. ప్రేమకుమార్ తెలిపారు. మొత్తం 972 మంది అభ్యర్థులకు గాను 884 మంది హాజరు కాగా, 88 మంది గైర్హాజరయ్యారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగిన ఈ పరీక్షల కోసం 6 కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీ చేశాయి. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని ఆయన పేర్కొన్నారు


