News October 6, 2024
VZM: మంత్రి కొండపల్లికి ఘన స్వాగతం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పెట్టుబడులను ఆహ్వానించేందుకు 10 రోజుల అమెరికా పర్యటన ముగించుకుని విజయనగరం జిల్లా విచ్చేసిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్కు ఘన స్వాగతం లభించింది. విజయనగరం రైల్వే స్టేషన్ వద్ద గంట్యాడ మండల టీడీపీ అధ్యక్షుడు కొండపల్లి భాస్కరరావు, పార్టీ నాయకులు మంత్రికి స్వాగతం పలికి సత్కరించారు. రాష్ట్ర అభివృద్ధికి మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు.
Similar News
News December 24, 2025
పారా యూత్ ఏషియన్ గోల్డ్ మెడలిస్ట్ను సత్కరించిన మంత్రి కొండపల్లి

దుబాయ్ వేదికగా ఇటీవల జరిగిన యూత్ ఏషియన్ పారా గేమ్స్ -2025 పోటీల్లో బాడ్మింటన్లో జిల్లాకు చెందిన పారా క్రీడాకారుడు పొట్నూరు ప్రేమ్ చంద్ గోల్డ్ మెడల్ సాధించారు. ఈసందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ను తన క్యాంపు కార్యాలయంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. క్రీడాకారుడుని మంత్రి శాలువాతో సత్కరించి, అభినందించారు.
News December 24, 2025
ఉద్యాన సాగు విస్తరణకు జిల్లాలో కొత్త ప్రణాళికలు: కలెక్టర్

ఉద్యాన పంటల విస్తరణ దిశగా జిల్లా కొత్త అడుగులు వేస్తోంది. జిల్లాలో కొత్తగా 10 వేల ఎకరాల్లో ఉద్యాన సాగుకు విజయనగరం కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ప్రణాళికలు రూపొందించారు. రబీ సీజన్లో 4,000 ఎకరాలు, ఖరీఫ్లో 6,000 ఎకరాలు అదనంగా సాగులోకి తేవాలని ప్రతిపాదించారు. ఈ అంశాలపై బుధవారం డీఆర్డీఏ, వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
News December 24, 2025
అభివృద్ధి ప్రాజెక్టుల భూసేకరణను పూర్తి చేయాలి: VZM కలెక్టర్

జిల్లాలో చేపట్టిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల భూసేకరణను పూర్తి చేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. విజయనగరం కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన సమీక్షలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం, జాతీయ రహదారి–516(B), రైల్వే లైన్ల విస్తరణ, ఐటీ పార్కులు, స్టీల్ ప్లాంట్, తదితర ప్రాజెక్టుల భూసేకరణ పురోగతిపై సమీక్షించారు. గిరిజన విశ్వవిద్యాలయం వద్ద విద్యుత్ లైన్లు వెంటనే తొలగించాలని ఆదేశించారు.


