News August 11, 2025
VZM: మనువడి అన్న ప్రాసనకు వెళ్లి మృతి

ద్వారకా బస్టాండ్లో విశాఖ-పలాస ప్లాట్ఫాం వద్ద శ్రీకాకుళం డిపో-1కు చెందిన బస్సు బ్రేక్ ఫెయిల్ అయ్యి ఢీకొట్టిన ఘటనలో మహిళ మృతి చెందింది. మృతురాలు విజయనగరం(D) ఎస్.కోట(M) పోతనాపల్లికి చెందిన ముత్యాలమ్మ(45)గా గుర్తించారు. గాజువాక గోపాలరెడ్డిపేటలో ఉన్న మనవడి(పెద్ద కుమార్తె కొడుకు) అన్నప్రాసన నిన్న జరగ్గా వచ్చింది. తిరిగి ఇంటి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కాగా.. ఈమె అక్కయ్యపాలెంలో ఓ హోటల్లో పనిచేస్తోంది.
Similar News
News September 26, 2025
VZM: ‘GST తగ్గుదలపై ప్రజలకు అవగాహన కల్పించాలి’

ప్రభుత్వం తగ్గించిన GSTపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ ఎస్.రామ్ సుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఛీఫ్ సెక్రటరీ కె.విజయానంద్ శుక్రవారం సచివాలయం నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఇంటింటికి వెళ్లి జీఎస్టీ తగ్గింపు, తగ్గింపు వలన జరిగే ఆదా గురించి ప్రజలకు వివరంగా తెలియజేయాలని ఆదేశించారు.
News September 26, 2025
పైడితల్లమ్మ పండగ సందర్భంగా ప్రత్యేక వైద్య శిబిరాలు

పైడితల్లమ్మ పండగ సందర్భంగా 6 ప్రాంతాల్లో, విజయనగరం ఉత్సవాల సందర్భంగా 15 ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తామని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి జీవనరాణి శుక్రవారం తెలిపారు. వైద్యాధికారులు, పారామెడికల్ సిబ్బందితో 3 షిప్టుల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు కొనసాగుతాయన్నారు. ఈ ప్రథమ చికిత్స వైద్య శిబిరాల సేవలను ప్రజలు, భక్తులు వినియోగించుకోవాలని ఆమె కోరారు.
News September 26, 2025
VZM: ‘పిల్లలకు ఇంటి నుంచే బాధ్యతలు నేర్పాలి’

పిల్లలకు ఇంటి నుంచే బాధ్యతలు నేర్పాలని, తల్లీదండ్రులే సంస్కారాన్ని నేర్పించి బయటకు పంపిస్తే చెడు పనులు చేయరని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ శైలజ పేర్కొన్నారు. విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో 8వ రాష్ట్రీయ పోషణ్ మాసోత్సవాల్లో ఆమె పాల్గొన్నారు. ఆడవారికి ఆపదలు పక్కనే పొంచి ఉంటాయని, తెలిసిన వారి నుంచే ఎక్కువ ముప్పు కలుగుతుందని అన్నారు. ఆడవారి రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలన్నారు.