News June 19, 2024
VZM: మాజీ సీఎం జగన్తో జిల్లా నేతల భేటీ
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో వైసీపీ జిల్లా నాయకులు మంగళవారం భేటీ అయ్యారు. మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య తదితరులు జగన్ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాలపై చర్చించారు.
Similar News
News October 4, 2024
రామతీర్థంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు గురువారం సాయంత్రం ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీరామచంద్రస్వామి వారి ఆస్థాన మండపంలో విష్వక్సేన ఆరాధన, స్వస్తి పుణ్యాహవచనము, యాగశాలలో అజస్ర దీపారాధన, మృత్సంగ్రహణము, అంకురారోపణ కార్యక్రమాలను వైదిక సిబ్బంది నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి వై.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.
News October 4, 2024
విజయనగరం: TODAY TOP NEWS
➣ రామతీర్థంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
➣ భోగాపురం: హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు
➣ గజపతినగరం: పాముకాటుతో రైతు మృతి
➣ పైడితల్లమ్మ హుండీల్లో నకిలీ నోట్లు
➣ 151 నుంచి 11 సీట్లుకు దిగిపోయారు: కిమిడి నాగార్జున
➣ పొలాల్లోకి దూసుకెళ్లిన విజయనగరం- రాజాం BUS
➣ ఒమ్మిలో పసుపు కొమ్ములతో అమ్మవారి విగ్రహం
➣ పార్వతీపురం జిల్లాలో 7,83,972 మంది ఓటర్లు
News October 3, 2024
VZM: హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు
భోగాపురం పోలీస్ స్టేషన్ లో 2021లో నమోదైన హత్య కేసు నిందితుడికి జిల్లా మహిళ కోర్టు జీవిత ఖైదు, రూ. 2,500 జరిమానా విధించిందని ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. కొంగవానిపాలెంకు చెందిన గోవింద మద్యం మత్తులో భార్య మంగమ్మను హత్య చేశాడని, మృతిరాలి సోదరి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి కోర్టుకు అప్పగించామన్నారు. నేరం రుజువు కావడంతో నిందితుడికి శిక్ష ఖరారైందని చెప్పారు.