News January 18, 2026
VZM: యాక్సిడెంట్.. తండ్రి కళ్లెదుటే చిన్నారి మృతి

విజయనగరం జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కిరణ్ కుమార్ తన కుమారుడు, బావ లోకేశ్తో కలిసి శ్రీకాకుళం (D) నుంచి విశాఖకు బైక్పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో పూసపాటి రేగ (M) పేరాపురం నేషనల్ హైవే వద్ద వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సిరా ఖనీష్ (6) అక్కడికక్కడే మృతి చెందాడు. తన కళ్లెదుటే కన్నబిడ్డ చనిపోవడంతో ఆ తండ్రి గుండెలవిసేలా విలపించాడు. లోకేశ్ పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖకు తరలించారు.
Similar News
News February 19, 2026
లింగంపల్లి-విశాఖపట్నం జన్మభూమి ఎక్స్ప్రెస్ సమయంలో మార్పులు

లింగంపల్లి నుంచి విశాఖపట్నం వరకు వెళ్లే జన్మభూమి ఎక్స్ప్రెస్ టైం టేబుల్ మారింది. లింగంపల్లిలో ఉదయం 6:55, బేగంపేటలో 7:20, సికింద్రాబాద్లో 7:40, చర్లపల్లి 8:00, రామన్న పేట 8:30, నల్గొండ 9:00, మిర్యాలగూడ 9:30కు చేరుతుంది. నడికుడి జంక్షన్ 10:00, పిడుగురాళ్ల 10:20, సత్తనపల్లి 10:45, గుంటూరు జంక్షన్ 11:45కు చేరుకుంటుందని రైల్వే అధికారులు ప్రకటించారు. ప్రయాణికులు గమనించాలని సూచించారు.
News February 19, 2026
కర్రెగుట్టల్లో భారీ ఎన్కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు హతం

కర్రెగుట్టల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఐదుగురు అగ్రనేతలు మృతిచెందినట్లు సమాచారం. ఈ ఉదయం ఆపరేషన్-2 కగార్ ప్రారంభమైన విషయం తెలిసిందే. కూంబింగ్ చేస్తున్న CRPF బలగాలకు మావోయిస్టులు ఎదురు పడటంతో కాల్పులు జరపగా ఐదుగురు మావోలు హతమయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ఆస్కారముంది. మావోయిస్ట్ కార్యదర్శి దేవ్ జీ టార్గెట్గా కూంబింగ్ కొనసాగుతోంది.
News February 19, 2026
శ్రీకాకుళంలో ఎండలు, ఉక్కబోత ప్రారంభం

శ్రీకాకుళం జిల్లాలో గత రెండు రోజులుగా ఎండలు, ఉక్కబోత పెరిగి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణంగా మహాశివరాత్రి తర్వాత రోజుల నుంచి వేడి తీవ్రత మొదలవుతుందని చెబుతున్నారు. ఈసారి కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. ఉదయం 10 గంటలకే ఎండ తీవ్రత గణనీయంగా పెరుగుతుంది. వాతావరణ నిపుణుల ప్రకారం, రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది.


