News September 24, 2025
VZM: ‘రెవెన్యూ వినతులపై సానుకూలంగా వ్యవహరించాలి’

విజయనగరం కలెక్టరేట్లో బుధవారం రెవెన్యూ అధికారులతో కలెక్టర్ రామ సుందర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మండల స్థాయి అధికారులు ఈ-ఆఫీస్ ద్వారానే ఉత్తర, ప్రత్యుత్తరాలు జరపాలన్నారు. ప్రజల నుంచి అందిన రెవెన్యూ వినతులకు సానుకూలంగా వ్యవహరించాలని సూచించారు. వినతుల పై ప్రజల సంతృప్తి పెరగాలని అన్నారు. ఈ సమావేశంలో జేసీ సేతు మాధవ్, DRO శ్రీనివాస్ మూర్తి పాల్గొన్నారు.
Similar News
News September 25, 2025
ఓటర్ల జాబితాను మ్యాప్ చేయండి: VZM కలెక్టర్

ఓటర్ల జాబితా సవరణ పై కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో కలెక్టర్ రామ సుందర్ రెడ్డి బుధవారం సమీక్షించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 2002 ఓటర్ల జాబితాతో 2025 ఓటర్ల జాబితాను మ్యాప్ చేయాలని తెలిపారు. ఓటర్ల సవరణ కోసం అందిన ఫారం 6, 7, 8ని నిర్దేశిత గడువు లోగా డిస్పోజ్ చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జేసీ సేతుమాధవన్, డీఆర్వో శ్రీనివాసమూర్తి పాల్గొన్నారు.
News September 24, 2025
VZM: ఆర్టీసీలో అప్రెంటీస్షిప్కు దరఖాస్తుల ఆహ్వానం

విజయనగరం జిల్లా పరిధిలో గల డిపోలు, యూనిట్లలో షీట్ మెటల్ వర్కర్ & పెయింటర్ ట్రేడ్లలో అప్రెంటిషిప్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి జి.వరలక్ష్మి తెలిపారు. www.apprenticeship.gov.in వెబ్సైట్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.
News September 24, 2025
VZM: ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర లక్ష్య సాధనలో జిల్లా ముందుండాలి’

గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగు పర్చేందుకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్ రామసుందర్ రెడ్డి అన్నారు. విజయనగరం జిల్లాలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యాచరణ అమలు తీరును తన ఛాంబర్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా MPDOలతో సమీక్షించారు. నగరపాలక సంస్థల్లో నిర్ణీత లక్ష్యాలు సాధిస్తున్నారన్నారు. గ్రామాల్లో కూడా నిర్దేశించిన లక్ష్యాలు సాధించాలని లేనిపక్షంలో చర్యలు తప్పవన్నారు.