News August 14, 2025
VZM: రేపు ఉచిత బస్సులను ప్రారంభించనున్న మంత్రి కొండపల్లి

స్త్రీశక్తి పథకంలో భాగంగా మహిళల ఉచిత బస్సు ప్రయాణాన్ని రేపు సాయంత్రం 4 గంటలకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ VZM ఆర్టీసీ బస్ స్టేషన్లో ప్రారంభించనున్నారు. రెండు డిపోలకు సంభంధించి 160 బస్సులు నడుస్తుండగా మహిళల ఉచిత ప్రయాణం కోసం 137 బస్సులు వినియోగించనున్నారు. ప్రస్తుతం రోజుకు 12,900 మహిళలు బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఉచిత ప్రయాణం ద్వారా 21,500 ప్రయాణం చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
Similar News
News August 15, 2025
ఎస్.కోట: తలపై రాయిపడి బాలుడు మృతి

కాలకృత్యాలకు వెళ్లిన బాలుడు తలపై రాయిపడి మృతి చెందిన సంఘటన ఎస్.కోటలోని ఆకుల డిపో సమీపంలో చోటు చేసుకుంది. గురువారం ఉత్తరప్రదేశ్కు చెందిన అమీన్ ఖాన్ (17) ఓ హోటల్లో పనిచేస్తున్నాడు. నిర్మాణంలో ఉన్న ఓభవనం పక్కన కాలకృత్యాలు కోసం వెళ్లాడు. అదే సమయంలో భవనం పైనుంచి నిర్మాణ కార్మికుడు రాయి కిందికి పడేయడంతో అది అమీన్ తలపై పడి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు.
News August 14, 2025
VZM: ప్రతి ఇంటిపైనా జాతీయ జెండా ఎగరాలి

ప్రతి పౌరునిలో దేశభక్తిని పెంపొందించేందుకు కృషి చేయాలని రాష్ట్ర హోం శాఖామంత్రి వంగలపూడి అనిత కోరారు. విజయనగరం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన హర్ ఘర్ తిరంగా సెల్ఫీ పాయింట్ వద్ద ఆమె గురువారం సెల్ఫీ దిగారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటిపైనా జాతీయ జెండాను ఎగురవేయాలని ఆమె పిలుపునిచ్చారు.
News August 14, 2025
VZM: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకులను ఘనంగా నిర్వహించాలి

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేయాలని JC సేతు మాధవన్ ఆదేశించారు. స్థానిక పోలీసు పెరేడ్ గ్రౌండ్లో వేడుకలకు చేసిన ఏర్పాట్లను గురువారం సాయంత్రం JC పరిశీలించారు. అక్కడి అధికారులకు పలు సూచనలు చేశారు. వర్షాలను దృష్టిలో పెట్టుకొని, పతాకావిష్కరణకు ఇబ్బంది ఎదురవ్వకుండా ఏర్పాట్లు చేయాలని జెసి సూచించారు. RDO కీర్తి ఆదేశించారు.