News January 12, 2025
VZM: విద్యుత్ వైర్ల చోరీకి వెళ్లి మృతి

విజయనగరంలోని రామలింగేశ్వర స్వామి ఆలయ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ అపార్ట్మెంట్లో కరెంట్ వైర్లు దొంగతనానికి వెళ్లి యువకుడు మృతి చెందాడు. శుక్రవారం అర్ధరాత్రి అశోక్ నగర్కు చెందిన శంకర్రావు అనే యువకుడు కొంతమంది వ్యక్తులతో కలిసి కరెంట్ వైర్ల దొంగతనానికి వెళ్లి ఐదో అంతస్తులో ఉన్న వైర్లను కత్తిరించాడు. అనంతరం పక్కనే లిఫ్ట్ కోసం ఏర్పాటు చేసిన ఖాళీ ప్రదేశంలో జారిపడి మృతి చెందాడు.
Similar News
News March 13, 2025
పది పరీక్షలు రాసేవారికి ఉచిత ఆర్టీసీ ప్రయాణం

విజయనగరం జిల్లాలో పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఆర్టీసీ గుడ్న్యూస్ చెప్పింది. 2024- 25 విద్యా సంవత్సరంలో మార్చి- 17వ తేదీ నుంచి జరగబోయే 10వ తరగతి పబ్లిక్ పరీక్షల కోసం హాజరుకానున్న విద్యార్థులకు పరీక్ష కేంద్రాలకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తోంది. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలనారాయణ తెలిపారు.
News March 12, 2025
VZM: ‘పీపీ మోడల్లో పర్యటకాభివృద్ధికి ముందుకు రావాలి’

జిల్లాలో పర్యాటకాభివృద్ధికి పీపీ మోడల్లో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చే వారికి అవసరమైన భూమి, ఇతర అనుమతులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు.బుధవారం కలెక్టర్ తన ఛాంబర్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని, బీచ్ టూరిజం , టెంపుల్ టూరిజం, క్రింద ఎవరైనా ముందుకు వస్తే మంచి లాభదాయకంగా ఉంటుందని తెలిపారు.
News March 12, 2025
VZM: పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు

ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న పదోతరగతి పరీక్షలకు పకడ్బంధీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. కలెక్టరేట్లోని సంబంధిత అధికారులతో బుధవారం సమీక్షించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 119 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. 1,124 మంది చొప్పున రెండు విడతలకు 2248 మంది ఇన్విజిలేటర్లను నియమిస్తున్నట్లు చెప్పారు.