News January 12, 2025
VZM: విద్యుత్ వైర్ల చోరీకి వెళ్లి మృతి

విజయనగరంలోని రామలింగేశ్వర స్వామి ఆలయ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ అపార్ట్మెంట్లో కరెంట్ వైర్లు దొంగతనానికి వెళ్లి యువకుడు మృతి చెందాడు. శుక్రవారం అర్ధరాత్రి అశోక్ నగర్కు చెందిన శంకర్రావు అనే యువకుడు కొంతమంది వ్యక్తులతో కలిసి కరెంట్ వైర్ల దొంగతనానికి వెళ్లి ఐదో అంతస్తులో ఉన్న వైర్లను కత్తిరించాడు. అనంతరం పక్కనే లిఫ్ట్ కోసం ఏర్పాటు చేసిన ఖాళీ ప్రదేశంలో జారిపడి మృతి చెందాడు.
Similar News
News September 19, 2025
DSP శ్రీనివాసరావుకు బదిలీ

VZM సబ్ డివిజన్ DSP శ్రీనివాసరావును వీఆర్కు బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనపై పలు అవినీతి ఆరోపణలు, ఫిర్యాదులు రావడంతో ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇంటెలిజెన్స్ విభాగం, పోలీస్ ఉన్నతాధికారులు DSPవ్యవహారాలపై సమగ్రంగా విచారణ జరిపిన అనంతరం చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఉమెన్ PS DSPగా పనిచేస్తున్న గోవిందరావుకు ఇన్ఛార్జ్ DSPగా బాధ్యతలు అప్పగించారు.
News September 19, 2025
భోగాపురం విమానాశ్రయ భూములపై కలెక్టర్ ఆరా

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టుల భూసేకరణపై కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో కలెక్టర్ రామసుందర రెడ్డి గురువారం సమీక్షా నిర్వహించారు. ఇప్పటివరకు జిఎంఆర్కు అప్పగించిన 2,200 ఎకరాల భూముల పరిస్థితి, వాటికి సంబంధించిన సమస్యలు తెలుసుకున్నారు. విమానయాన అనుబంధ పరిశ్రమల ఏర్పాటు కోసం కేటాయించిన 540 ఎకరాల భూములపై ఆరా తీశారు.
News September 18, 2025
VZM: ‘యూరియా కొరతపై సోషల్ మీడియాలో అసత్య వార్తలు’

విజయనగరం జిల్లాలో యూరియా కొరత లేదని కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి గురువారం తెలిపారు. సోషల్ మీడియాలో కొంతమంది రైతులను తప్పుదారి పట్టించే విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అటువంటి వార్తలు పూర్తిగా అసత్యమని ఆయన స్పష్టం చేశారు. యూరియాను ఇప్పటివరకు 30,395 మెట్రిక్ టన్నులు, 11,426 మెట్రిక్ టన్నులు డి.ఏ.పి, 9379 మెట్రిక్ టన్నులు కాంప్లెక్స్ వివిధ కేంద్రాల్లో అందుబాటులో ఉంచామన్నారు.