News July 18, 2024

VZM: సింహచలం గిరి ప్రదక్షిణకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

image

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సింహచలం గిరి ప్రదక్షిణ చేసే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 20,21 తేదీలలో జరుగుతున్న గిరిప్రదక్షిణకు హాజరవుతున్న ప్రయాణికులకు APSRTC విజయనగరం డిపో నుంచి సింహచలం వరకు 40 ప్రత్యేక బస్సులు నడపబడుతున్నాయన్నారు. కావున ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని తెలిపారు.

Similar News

News September 14, 2025

VZM: ‘గాలికుంటు వ్యాధిని నిరోధించండి’

image

విజయనగరం జిల్లాలో గాలికుంటు వ్యాధిని నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఆదేశించారు. ఈనెల 15 నుంచి అక్టోబర్ 15 వరకు నిర్వహించే గాలికుంటు వ్యాధి నిరోధక టీకా కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికలను తన చాంబర్లో శనివారం కలెక్టర్ ఆవిష్కరించారు. జాతీయ పశువ్యాధి నియంత్రణ పథకంలో భాగంగా నెలరోజులపాటు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలను పశువులకు వేయడం ద్వారా వ్యాధిని నియంత్రించవచ్చన్నారు.

News September 13, 2025

VZM: ‘షరతులు లేకుండా వాహన మిత్ర అమలు చేయాలి’

image

వాహన మిత్ర సంక్షేమ పథకంలో ఎలాంటి షరతులు లేకుండా ఆటో, మ్యాక్సీ, టాక్సీ, జీపు, టాటా మ్యాజిక్ డ్రైవర్లందరికీ అమలు చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ డిమాండ్ చేశారు. విజయనగరంలోని బుచ్చన్న కోనేరు వద్ద కార్మికులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. నెలకు 5వేల పింఛన్‌తో కూడిన సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

News September 13, 2025

మందు బాబులకు భారీగా జరిమానాలు: VZM SP

image

మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై భారీగా జరిమానాలను కోర్టు విధించిందని ఎస్పీ వకుల్ జిందాల్ శనివారం తెలిపారు. మొత్తం 85 మందిని కోర్టులో ప్రవేశపెట్టగా ఒక్కొక్కరికి రూ.10వేలు చొప్పున రూ.8.50 లక్షల జరిమానాను విధిస్తూ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ తేజ చక్రవర్తి తీర్పు చెప్పారన్నారు. మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాల బారిన పడడమే కాకుండా ఇతరులకు కూడా నష్టాన్ని కలిగిస్తున్నారన్నారు.