News March 24, 2025

VZM: స్వర్ణంతో సత్తా చాటిన లలిత

image

ఢీల్లీ వేదికగా జరగుతున్న రెండవ ఖేలో ఇండియా పారా గేమ్స్‌లో ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన కిల్లక లలిత సత్తా చాటింది. ఆదివారం జరిగిన 200 మీటర్ల పరుగు పందెంలో బంగారు పతకం సాధించింది. ఇప్పటికే ఆమె శనివారం జరిగిన 400 మీటర్ల పరుగలో రజతం కైవసం చేసుకుందని పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కె.దయానంద్ తెలిపారు. పరుగులో రాణిస్తున్న లలితను పలువురు అభినందించారు.

Similar News

News February 13, 2026

VZM: ‘ఆ సర్టిఫికేట్ అందించకపోతే పెన్షన్ కట్’

image

రాష్ట్ర ప్రభుత్వ సర్వీస్, కుటుంబ పెన్షన్ దారులు తమ పెన్షన్ నిరంతరాయంగా పొందేందుకు నిర్ణీత గడువులోగా లైఫ్ సర్టిఫికేట్ అందించాలని జిల్లా ట్రైజరీ అధికారి వి.నాగ మహేశ్ శుక్రవారం తెలిపారు. ఈ 28వ తేదీలోపు తమ లైఫ్ సర్టిఫికేట్‌ను ఇవ్వల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. డిజిటల్ విధానంలో Jeevan Pramaan యాప్ ద్వారా ఇంటి నుంచే జీవన ప్రమాణ పత్రాన్ని సమర్పించవచ్చునని పేర్కొన్నారు.

News February 13, 2026

గంట్యాడ: పచ్చకామెర్లతో యువకుడి మృతి

image

గంట్యాడ మండలం కొండ తామరాపల్లి గ్రామానికి చెందిన యువకుడు పచ్చకామెర్లతో మృతి చెందాడు. కోన పవన్ కుమార్ (22) జ్వరం, పచ్చకామెర్లు రావడంతో 5 రోజుల క్రితం విజయనగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. పవన్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గురువారం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వెంటిలేటర్‌పై ఉన్న పవన్‌‌ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందాడు.

News February 13, 2026

హ్యూమన్ రైట్స్ పేరుతో బెదిరింపులు చేస్తే జైలుకే: ఎస్పీ

image

హ్యూమన్ రైట్స్ కమిషన్, RTI ప్రతినిధులమని చెబుతూ మోసాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ హెచ్చరించారు. గ్రామస్థాయిలో ఇటువంటి సంస్థలకు ఎటువంటి ప్రైవేట్ ప్రతినిధులు ఉండరని ఆయన స్పష్టం చేశారు. ఎవరైనా గుర్తింపు కార్డులు చూపి డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు. అక్రమ వసూళ్లకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు.