News March 24, 2025

VZM: స్వర్ణంతో సత్తా చాటిన లలిత

image

ఢీల్లీ వేదికగా జరగుతున్న రెండవ ఖేలో ఇండియా పారా గేమ్స్‌లో ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన కిల్లక లలిత సత్తా చాటింది. ఆదివారం జరిగిన 200 మీటర్ల పరుగు పందెంలో బంగారు పతకం సాధించింది. ఇప్పటికే ఆమె శనివారం జరిగిన 400 మీటర్ల పరుగలో రజతం కైవసం చేసుకుందని పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కె.దయానంద్ తెలిపారు. పరుగులో రాణిస్తున్న లలితను పలువురు అభినందించారు.

Similar News

News March 26, 2025

గొల్లాదిలో కొట్లాట.. ఏడుగురుకి గాయాలు

image

బాడంగి మండలం గొల్లాది పోలమ్మ ఆలయం సమీపంలో కామన్నవలస, గొల్లాది గ్రామానికి చెందిన వారి మధ్య మంగళవారం కొట్లాట జరిగినట్లు ఎస్ఐ తారకేశ్వరరావు చెప్పారు. ఆలయం సమీపంలో గొల్లాదికి చెందిన ఈపు ఈశ్వరరావు మేకలు మేపుతుండగా కామన్నవలసకి చెందిన ఆదినారాయణ మేకలు మేపేందుకు వచ్చాడు. వారి మధ్య కొట్లాట జరగడంతో ఇరువర్గాలకు చెందిన ఏడుగురు గాయపడ్డారు. గాయపడిన వారు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

News March 26, 2025

కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్న విజయనగరం జిల్లా కలెక్టర్ 

image

విజయవాడలో జరుగుతున్న రెండు రోజుల కలెక్టర్ల సమావేశంలో విజయనగరం జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్. అంబేడ్కర్ పాల్గొన్నారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి నివేదిక ఉన్నతాధికారులకు అందజేశారు. పెండింగ్ పనులు పూర్తి చేయడానికి అవసరమైన నిధులు, అనుమతులు గురించి చర్చించారు. జిల్లాలో టూరిజం అభివృద్ధి, వేసవిలో త్రాగునీటి ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన చర్యలు గురించి చర్చించారు.

News March 25, 2025

నెల్లిమర్ల: నర్సింగ్ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు

image

రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నర్సింగ్ విద్యార్థులకు జర్మన్ భాషలో ఉచితంగా శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు స్కిల్బీ సంస్థ ప్రతినిధి ఉజ్వల్ తెలిపారు. నెల్లిమర్ల MIMSలో నర్సింగ్ విద్యార్థులకు మంగళవారం అవగాహన కల్పించారు. ప్రభుత్వ సహకారంతో ఎనిమిది నెలల శిక్షణ అనంతరం జర్మనీలో రూ.2.50 లక్షల నుంచి రూ.3.50 లక్షల జీతంతో ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.

error: Content is protected !!