News March 13, 2025
VZM: 15,226 మంది లబ్ధిదారులకు గుడ్ న్యూస్

నిర్మాణం మధ్యలో నిలిచిపోయిన ఇళ్లను పూర్తిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు సహాయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ప్రకటించిన అదనపు ఆర్ధిక సహాయంతో జిల్లాలో 15,226 మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుంది. 12,240 మంది బీసీలకు, 2,231 మంది ఎస్సీలకు ఒక్కో ఇంటికి రూ.50 వేలు, 565 మంది షెడ్యూల్డు తెగల వారికి రూ.75 వేలు, 190 మంది ఆదిమ తెగలకు రూ.లక్ష చొప్పున సహాయం అందనుంది.
Similar News
News March 14, 2025
‘విజయనగరం జిల్లా రైతులకు రూ.2.5కోట్ల రాయితీ’

విజయనగరం జిల్లాలో అర్హులైన రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ ఉపకరణాలు అందించేందుకు ప్రభుత్వం రూ.2.5కోట్లు సబ్సిడీ ఇవ్వనుందని జిల్లా వ్యవసాయ అధికారి వి.టి.రామారావు చెప్పారు. గురువారం తెర్లాం వచ్చిన ఆయన ఈ విషయాన్ని తెలిపారు. స్ప్రింక్లర్లు, పవర్ స్ప్రింక్లర్లు, రోటోవీటర్లు, ట్రాక్టర్ పరికరాలు 50 శాతం రాయితీపై అందజేయనున్నారు. రైతులు వ్యవసాయ అధికారులు ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు.
News March 14, 2025
విజయనగరం- భద్రాచలం ప్రత్యేక బస్సులు

విజయనగరం డిపో నుంచి భద్రాచలం పుణ్యక్షేత్రానికి శ్రీరామ నవమి సందర్భంగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ శ్రీనివాసరావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ బస్సులు 5వ తేదీ సాయంత్రం 4:30 కి బయలుదేరి 6వ తేదీ ఉదయం 5 గంటలకు భద్రాచలం చేరుకుని, అదే రోజు సాయంత్రం 5 గంటలకు భద్రాచలంలో బయలుదేరి 7వ తేదీన ఉదయం 5:30 గంటలకి విజయనగరం చేరుతాయన్నారు.
News March 13, 2025
విజయనగరం- భద్రాచలం ప్రత్యేక బస్సులు

విజయనగరం డిపో నుంచి భద్రాచలం పుణ్యక్షేత్రానికి శ్రీరామ నవమి సందర్భంగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ శ్రీనివాసరావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ బస్సులు 5వ తేదీ సాయంత్రం 4:30 కి బయలుదేరి 6వ తేదీ ఉదయం 5 గంటలకు భద్రాచలం చేరుకుని, అదే రోజు సాయంత్రం 5 గంటలకు భద్రాచలంలో బయలుదేరి 7వ తేదీన ఉదయం 5:30 గంటలకి విజయనగరం చేరుతాయన్నారు.