News July 19, 2024
VZM: 19న కోస్టల్ మేనేజ్ మెంట్ జోన్పై పబ్లిక్ హియరింగ్

ఏ.పి. కోస్టల్ మేనేజ్ మెంట్ జోన్ పై ఈనెల 19న ఉదయం 10-30 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పబ్లిక్ హియరింగ్ నిర్వహించనున్నట్లు కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజనీర్ సరిత తెలిపారు. కలెక్టర్ అంబేద్కర్ అధ్యక్షతన ఉదయం 10-30 గంటలకు కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో పబ్లిక్ హియరింగ్ జరుగుతుందని చెప్పారు. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ 2019 చట్ట నిబంధనల మేరకు ఈ పబ్లిక్ హియరింగ్ జరుగుతుందని తెలిపారు.
Similar News
News December 12, 2025
VZM: జిల్లాలో ఎరువుల కొరత లేదు.. వ్యవసాయాధికారి

రబీ పంటల అవసరాలకు జిల్లాలో యూరియా నిల్వలు పూర్తిగా అందుబాటులో ఉన్నాయని వ్యవసాయాధికారి రామారావు గురువారం తెలిపారు. ఇప్పటివరకు 8,058 మెట్రిక్ టన్నులు అందగా.. 5,110 టన్నులు రైతులకు విక్రయించారన్నారు. నెలాఖరుకి మరో 2,600 టన్నులు చేరనున్నాయని, ప్రస్తుతం 3,058 టన్నులు RSK, గోదాముల్లో ఉన్నాయన్నారు. ఎరువుల కొరత ఏదీ లేదని, ఎంఆర్పీకి మించి అమ్మితే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News December 12, 2025
15న పొట్టి శ్రీరాముల ఆత్మార్పణ దినోత్సవం: VZM కలెక్టర్

ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణ త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాముల ఆత్మార్పణ దినోత్సవం ఈనెల 15న విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి గురువారం తెలిపారు. ఆ రోజు ఉదయం 10.30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ఈ కార్యక్రమానికి కలెక్టరేట్లో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది హాజరుకావాలని ఆదేశించారు.
News December 12, 2025
15న పొట్టి శ్రీరాముల ఆత్మార్పణ దినోత్సవం: VZM కలెక్టర్

ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణ త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాముల ఆత్మార్పణ దినోత్సవం ఈనెల 15న విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి గురువారం తెలిపారు. ఆ రోజు ఉదయం 10.30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ఈ కార్యక్రమానికి కలెక్టరేట్లో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది హాజరుకావాలని ఆదేశించారు.


