News May 15, 2024

VZM: 2019 కంటే తక్కువ ఓటింగ్ నమోదైన నియోజకవర్గాలివే..

image

ఉమ్మడి విజయనగరం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో మూడుచోట్ల 2019 ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతం కంటే ఇప్పుడు తక్కువగా నమోదైంది. 2019లో సాలూరులో 79.46%, ఎస్.కోటలో 86.18%, గజపతినగరంలో 86.9% ఓటింగ్ నమోదైంది. 2024లో చూస్తే సాలూరులో 76.45%, ఎస్.కోటలో 85.45%, గజపతినగరంలో 86.44 శాతంగా పోలయ్యాయి. మరి ఇది గెలుపు ఓటముల్లో ఎవరిపై ప్రభావం చూపేనో..?

Similar News

News September 27, 2025

పైడిమాంబ సిరిమానోత్సవానికి సీఎంకు ఆహ్వానం

image

ఉత్తరాంధ్ర భక్తుల ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు అక్టోబర్ 6, 7 తేదీల్లో జరగనున్న సందర్భంగా సీఎం చంద్రబాబుకు ఉమ్మడి జిల్లా ప్రజా ప్రతినిధులు ఆహ్వానం పలికారు. రాష్ట్ర పండగగా జరిగే శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని సీఎంను ఆహ్వానించినట్లు మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి తెలిపారు.

News September 27, 2025

అక్టోబర్ 1న జిల్లాకు సీఎం చంద్రబాబు

image

సీఎం చంద్రబాబు అక్టోబర్ 1న జిల్లాలో పర్యటించనున్నారు. దత్తిరాజేరు మండలంలోని దత్తి గ్రామాన్ని సందర్శించి పలువురు లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జేసీ సేతుమాధవన్, డీఎస్పీ రాఘవులు, తదితరులు హెలీ ప్యాడ్, సభావేదికకు సంబందించి ఏర్పాట్లును శనివారం పరిశీలించారు. పర్యటనకు సంబందించి షెడ్యూల్ ఇంకా విడుదల కావాల్సి ఉంది.

News September 27, 2025

విచారణ వేగవంతానికి ఈ-సమన్స్ అమలు చేయాలి: VZM SP

image

విజయనగరం జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్‌లలో పని చేస్తున్న అధికారులు, కోర్టు కానిస్టేబుళ్లు, కోర్టు మోనటరింగ్
అధికారులు, హెచ్సీలతో SP దామోదర్ శనివారం జూమ్ మీటింగు నిర్వహించారు. నమోదైన కేసుల్లో నిందితులకు న్యాయ స్థానాల్లో శిక్షపడేలా చేయడంలో కోర్టు కానిస్టేబుళ్లు, కోర్టు మోనటరింగ్ సిబ్బంది పాత్ర క్రియాశీలకమన్నారు. కేసుల విచారణ మరింత వేగవంతంగా జరిపించేందుకు ఈ-సమన్స్ అమలు చేయాలన్నారు.