News March 19, 2025

VZM: 23న జ‌రిగే అక్ష‌రాస్య‌తా ప‌రీక్ష‌కు ఏర్పాట్లు

image

ఈ నెల 23వ తేదీన జిల్లా వ్యాప్తంగా నిర్వ‌హించే ప్రాథమిక అక్ష‌రాస్య‌తా ప‌రీక్ష‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాల‌ని DRDA PD ఎ.క‌ల్యాణ‌చ‌క్ర‌వ‌ర్తి, వ‌యోజ‌న విద్య DD ఎ.సోమేశ్వ‌ర్రావు కోరారు. స్థానిక DRDA స‌మావేశ మందిరంలో వివిధ శాఖ‌ల అధికారుల‌తో స‌మ‌న్వ‌య స‌మావేశాన్ని మంగ‌ళ‌వారం నిర్వ‌హించారు. ఉద‌యం 10 నుంచి సాయంత్రం 5 గంట‌లు మ‌ధ్య ల‌బ్దిదారులు వారికి వీలైన స‌మ‌యంలో పరీక్ష నిర్వహిస్తామన్నారు.

Similar News

News April 10, 2025

VZM: రోడ్డు ప్రమాదంలో గాయపడిన టీచర్ మృతి

image

పద్మానాభంకి చెందిన వి.రమణ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం 11 గంటలకు మృతి చెందారు. మంగళవారం సాయంత్రం వ్యక్తిగత పనిమీద విజయనగరం బైక్‌పై వెళ్తుండగా చిన్నాపురం సమీపంలో మలుపు వద్ద ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా రెండు బైకులు ఢీకొనగా రమణ తీవ్రంగా గాయపడ్డారు. అతడిని విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈయన ఎస్.రాయవరం హైస్కూల్‌లో సోషల్ టీచర్‌గా పనిచేస్తున్నారు.

News April 10, 2025

రేగిడి: పోక్సో కేసులో నలుగురి అరెస్ట్

image

విజయనగరం జిల్లా రేగిడి మండలానికి చెందిన జగదీశ్ ఈనెల 26న అదే మండలానికి చెదిన బాలికను ప్రేమ పేరుతో విజయవాడ తీసుకెళ్లిపోయాడు. బాలిక కనబడకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో యువకుడు బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు తేలడంతో జగదీశ్‌తో పాటు అతనికి సాయం చేసిన మరో ముగ్గురిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు చీపురుపల్లి డీఎస్పీ రాఘవులు బుధవారం తెలిపారు.

News April 9, 2025

బొబ్బిలి రైల్వే స్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతి

image

బొబ్బిలి రైల్వే స్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందినట్లు జీఆర్పీ హెచ్‌సీ ఈశ్వరరావు బుధవారం తెలిపారు. రెండో ప్లాట్‌ఫామ్‌పై మృతదేహం లభ్యమైందని చెప్పారు. మృతుడి ఆచూకీని తెలిపే ఎటువంటి ఆధారాలు తమకు దొరకలేదని అనారోగ్య కారణాలతో చనిపోయి ఉండవచ్చని ప్రాథమిక అంచనా వేసినట్లు తెలిపారు. ఫొటోలో ఉన్న వ్యక్తిని గుర్తు పడితే బొబ్బిలి రైల్వే పోలీసులను సంప్రదించాలని హెచ్‌సీ ఈశ్వరరావు కోరారు.

error: Content is protected !!