News March 4, 2025

VZM: 4వేల మంది మహిళలతో మహిళా దినోత్సవం

image

మార్చి 8న నిర్వ‌హించే మ‌హిళా దినోత్స‌వానికి భారీగా ఏర్పాట్లు చేయాల‌ని క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ బీఆర్‌ అంబేడ్కర్ ఆదేశించారు. ఏర్పాట్ల‌పై కలెక్టరేట్‌లోని త‌న ఛాంబ‌ర్లో వివిధ శాఖ‌ల అధికారుల‌తో సోమ‌వారం స‌మీక్ష నిర్వ‌హించారు. ఐసీడీఎస్ ఆధ్వ‌ర్యంలో సుమారు 4 వేల మంది మ‌హిళ‌ల‌తో విజయనగరంలోని రాజీవ్ స్టేడియంలో మహిళా దినోత్స‌వ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించాల‌ని ఆదేశించారు.

Similar News

News March 4, 2025

VZM: మీ ప్రాంతంలో తాగునీటి సమస్య ఉందా?

image

విజయనగరం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైనా తాగు నీటి సమస్య తలెత్తితే టెలిఫోన్ ద్వారా 9100120711 నంబర్‌కు తెలియజేయవచ్చునని కలెక్టర్ అంబేడ్కర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్.డబ్ల్యు.ఎస్ ఆధ్వర్యంలో ఈ నంబర్ పని చేస్తుందని, తాగు నీటి సమస్యల పరిష్కారానికి నిత్యం సిబ్బంది అందుబాటులో ఉంటారని కలెక్టర్ స్పష్టం చేశారు. >Share it

News March 3, 2025

హత్యాచారయత్నం ఘటనలో నిందితుడికి పదేళ్ల జైలు: SP

image

బొండపల్లి పోలీస్ స్టేషన్‌లో 2020లో నమోదైన వరకట్న వేధింపుల కేసులో నిందితుడు తవిటయ్యకు పదేళ్ల జైలు శిక్ష, రూ.2,500 జరిమానాను కోర్టు విధించిందని ఎస్పీ వకుల్ జిందాల్ సోమవారం తెలిపారు. చంద్రంపేటకు చెందిన తవిటయ్య అదనపు కట్నం తేవాలని వేధిస్తుండేవాడని, ఈ క్రమంలో కన్నవారి ఇంటి వద్ద ఉన్న భార్య, ఇతర కుటుంబ సభ్యులు నిద్రిస్తుండగా పాకకు నిప్పు పెట్టి హత్యాయత్నానికి పాల్పడడంతో అప్పట్లో కేసు నమోదైందన్నారు.

News March 3, 2025

MLC కౌంటింగ్.. ఎలిమినేట్ అవుతున్న అభ్యర్థులు

image

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో తక్కువ ఓట్లు పోలైన అభ్యర్థులు ఎలిమినేట్ అవుతున్నారు. 6వ రౌండ్ పూర్తయ్యేసరికి ఐదుగురు అభ్యర్థులను ఎలిమినేట్ చేశారు. ఇంకా ఐదుగురు అభ్యర్థులు మిగిలి ఉన్నారు. ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన అభ్యర్థులలో పి.శివ ప్రసాద్, ఎస్‌ఎస్.పద్మావతి, డాక్టర్ కే.రాధాకృష్ణ, ఆర్.సత్యనారాయణ, డాక్టర్ ఎస్.శ్రీనివాసరావు ఉన్నారు. కాగా ‘గాదె’ ముందంజలో కొనసాగుతున్నారు.

error: Content is protected !!