News August 28, 2025

VZM: 452 మందిపై కేసులు..రూ. 4.75 లక్షలు ఈ-చలానాలు

image

హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపిన వారిపై చర్యలు తప్పవని ఎస్పీ వకుల్ జిందల్ గురువారం హెచ్చరించారు. ఆగష్టు 18 నుంచి 24వ తేదీ వరుకు జిల్లాలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించామన్నారు. మొత్తం 452 కేసులు నమోదు చేసి రూ.4.75 లక్షల ఈ-చలానాలు విధించామన్నారు. ద్విచక్రవాహనం నడిపే వ్యక్తితో పాటు వెనక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలని స్పష్టం చేశారు. హెల్మెట్ ఉంటే ప్రాణాపాయం నుంచి బయట పడొచ్చన్నారు.

Similar News

News August 28, 2025

VZM: పింఛన్ల పంపిణీపై కలెక్టర్ కీలక ప్రకటన

image

ఇటీవల రద్దు చేసిన వికలాంగ పింఛన్ దారులకు ఈ నెల పింఛన్ అందజేయనున్నట్లు జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. రద్దు చేసిన పింఛన్ దారులకు 30 రోజుల్లోగా అప్పీల్ చేసుకోవాలని నోటీసులు జారీ చేయడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో అప్పీల్ చేసుకున్న వారికి మాత్రమే ఈ నెల పింఛన్ అందజేయడం జరుగుతుందన్నారు.

News August 28, 2025

VZM: టీడీపీ జిల్లా అధ్యక్ష పదవికి 8 మంది పోటీ..!

image

జిల్లా TDP అధ్యక్ష పదవికి పోటీ గట్టిగానే ఉంది. 8 మంది TDP సీనియర్ నేతలు పోటీ పడుతున్నట్లు చర్చ సాగుతుంది. వారిలో KA నాయుడు, సువ్వాడ రవిశంకర్, కంది చంద్రశేఖర్, కరణం శివరామకృష్ణ, కోళ్ల అప్పలనాయుడు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరితోపాటు మరో నలుగురుTDP సీనియర్ నేతల అధ్యక్ష పదవికి దరఖాస్తులు చేశారు. ఇటీవల త్రిసభ్య కమిటీ సమావేశం కూడా జరిగింది. 2 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

News August 28, 2025

VZM: ఈనెల 29న జాబ్ మేళా

image

విజయనగరం (D) జామి (M) భీమసింగిలోని శ్రీ బాలాజీ జూనియర్ కాలేజీలో ఈనెల 29న జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ప్రశాంత్ కుమార్ బుధవారం తెలిపారు. టెన్త్, ఇంటర్, ITI, డిప్లమా, డిగ్రీ, బీటెక్, ఏదైనా పీజీలో ఉత్తీర్ణత సాధించిన 18 నుంచి 35 ఏళ్ల వయసు ఉన్నవారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తిగల యువతీ, యువకులు <>https://naipunyam.ap.gov.in <<>>లింక్ పై క్లిక్ చేసి వివరాలు నమోదు చేసుకోండి.