News March 15, 2025

VZM: కన్న తండ్రి ముందే విషం తాగి మృతి

image

దొంగతనం నింద తనపై మోపారని మనస్తాపానికి గురైన ఓ యువకుడు కన్న తండ్రి ముందే విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన భోగాపురం మండలం అమకాంలో ఈనెల 11న చోటుచేసుకోగా సదరు యువకుడు చికిత్స పొందుతూ నిన్న మృతి చెందాడు. సమీపంలోని ఓ రిసార్ట్స్‌లో పనిచేస్తున్న అప్పలనాయుడు.. టూరిస్ట్ సెల్ ఫోన్ దొంగలించాడని యాజమాన్యం నిందించడంతో అవమానంగా బావించి పురుగు మందు తాగాడు. చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయాడు.

Similar News

News March 16, 2025

విజయనగరం: 119 కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు

image

విజయనగరం జిల్లాలో సోమవారం నుంచి జరిగే పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేశామని DEO యు. మాణిక్యం నాయుడు వెల్లడించారు. ఆయన వివరాల ప్రకారం. 
➤ జిల్లాలో మొత్తం ఎగ్జాం సెంటర్లు: 119 
➤ పరీక్ష రాసే విద్యార్థుల సంఖ్య: 23,765 
➤ ఫ్లైయింగ్ స్క్వాడ్‌లు: 7 
➤ సిట్టింగ్ స్క్వాడ్‌లు: 2 
➤ ఇన్విజిలేటర్లు:2,248 
☞ అందరికీ Way2News తరఫున All THE Best

News March 15, 2025

VZM: ‘ప్రభుత్వ ఆదాయాన్ని పెంచండి’

image

విజయనగరంలోని GST కార్యాలయాన్ని రాష్ట్ర జీఎస్టీ కమిషనర్, జిల్లా ప్రత్యేకాధికారి ఏ.బాబు శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో పన్ను వసూళ్లపై చర్చించారు. రాష్ట్ర రెవెన్యూ పెంపుపై కొన్ని మార్గదర్శకాలను ఆయన అందజేశారు. మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటిస్తూ ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాలని సూచించారు. ప్రభుత్వానికి రావలసిన రెగ్యులర్ రిటర్న్, బకాయి పన్నుల వసూలు చేయాలన్నారు.

News March 15, 2025

VZM: ఈనెల 16న FRO ఉద్యోగాల‌కు రాత‌ప‌రీక్ష‌

image

ఫారెస్ట్ రేంజ్ ఆఫీస‌ర్స్ ఉద్యోగాల భ‌ర్తీకి ఈ నెల 16న జ‌రిగే రాత‌ప‌రీక్ష‌కు ప‌క‌డ్బంధీగా ఏర్పాట్లు చేయాల‌ని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్‌.శ్రీ‌నివాస‌మూర్తి ఆదేశించారు. పట్టణంలోని త‌మ ఛాంబ‌ర్లో శ‌నివారం స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఈ ప‌రీక్ష‌లు ఉద‌యం 9.30 నుంచి 12 గంట‌లు వ‌ర‌కు, మ‌ధ్యాహ్నం 2.30 నుంచి 5 గంట‌లు వ‌ర‌కు జ‌రుగుతాయ‌ని చెప్పారు. రెండు ప‌రీక్షా కేంద్రాల‌ను ఏర్పాటు చేశామన్నారు.

error: Content is protected !!