News June 14, 2024
VZM: నాడు-నేడు రెండో విడత పనులు కొనసాగేనా?
పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా గత ప్రభుత్వంలో ప్రారంభించిన నాడు నేడు రెండో విడత పనులు పలు పాఠశాలల్లో నిలిచిపోయాయి. ఉమ్మడి విజయనగరం జిల్లాలో సుమారు రూ. 50కోట్ల నిధులతో పలు పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించారు. కాగా నిధుల లేమితో కొన్ని పాఠశాలల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులు జరగలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో నాడు-నేడు రెండో విడత పనులపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాల్సి ఉంది.
Similar News
News October 2, 2024
విజయనగరంలో బస చేసిన మహాత్ముడు.. ఎప్పుడంటే
మహాత్మా గాంధీకి విజయనగరంతో విడదీయరాని అనుబంధం ఉంది. ఆయన మూడుసార్లు విజయనగరంలో పర్యటించారు. 1921 మార్చి 30న మొదటి సారి ఇక్కడకు రాగా, 1929 ఏప్రిల్ 30న రెండోసారి వచ్చారు. ఇక మూడోసారి 1933 డిసెంబరు 28, 29 తేదీల్లో రెండురోజుల పాటు విజయనగరంలో పర్యటించారు. అప్పట్లో 5వ నంబరు బంగ్లాగా పిలిచే ప్రస్తుత అశోక్ బంగ్లాలో ఆయన బస చేశారు. ఇప్పటికీ ఆ జ్ఞాపకాలు బంగ్లాలో కనిపిస్తాయి.
News October 2, 2024
VZM: రేపటి నుంచి టెట్ ఆన్లైన్ పరీక్షలు.. జిల్లాలో ఐదు కేంద్రాలు
రేపటి నుంచి ఈ నెల 21 వరకు టెట్ పరీక్షలు జరగనున్నాయి. ఇందుకు గాను జిల్లాలో 5 కేంద్రాలు ఏర్పాటు చేశారు. రెండు పూటలా ఉదయం 9.30 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2 .30 నుంచి 5 గంటల వరకు ఆన్లైన్లో పరీక్షలు జరుగుతాయి. మొత్తం 22,889 మంది అభ్యర్ధులు టెట్ పరీక్షలకు హాజరు కానున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షల ఇన్ఛార్జ్గా ఆర్డీవో దాట్ల కీర్తి వ్యవహరించనున్నారు.
News October 2, 2024
విజయనగరం ఉత్సవాల భద్రత ఏర్పాట్లపై సమీక్ష
జిల్లాలో ఈనెల 13న నిర్వహించే విజయనగరం ఉత్సవాలు, ఈ నెల 14, 15 తేదీల్లో నిర్వహించనున్న పైడిమాంబ తొలేళ్ళు, సిరిమానోత్సవంకు చేపట్టే భద్రత, బందోబస్తు ఏర్పాట్లుపై ఎస్పీ వకుల్ జిందాల్ మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. పండగలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని సూచించారు. శాంతియుతంగా నిర్వహించే విధంగా భద్రత చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.