News April 8, 2024

VZM: మృతుల కుటుంబాలకు నష్టపరిహారం

image

పరవాడ జెఎన్ ఫార్మాసిటీలోని రెండు పరిశ్రమల్లో జరిగిన ప్రమాదాల్లో మృతి చెందిన జిల్లాకు చెందిన కార్మికుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించేందుకు యాజమాన్యాలు అంగీకరించాయని CITU నేత గనిశెట్టి సత్యనారాయణ తెలిపారు. గంట్యాడ మండలం సిరిపురానికి చెందిన ఆళ్ల గోవింద కుటుంబానికి రూ.32.50 లక్షలు, పూసపాటిరేగ మండలం గొల్లపేటకు చెందిన రమణ కుటుంబానికి రూ.35 లక్షల పరిహారం చెల్లించేందుకు అంగీకారం కుదిరిందన్నారు.

Similar News

News December 13, 2025

ఈనెల 14 నుంచి ఇంధన పొదుపు వారోత్సవాలు: CMD

image

ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహించాలని APEPDCL సీఎండీ పృథ్వీ తేజ్ సిబ్బందికి ఆదేశించారు. విజయనగరం జిల్లా వ్యాప్తంగా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో విభిన్న కార్యక్రమాలు చేపట్టి అన్ని వర్గాల విద్యుత్ వినియోగదారులకు ఇంధన పొదుపుపై అవగాహన కల్పించాలని శనివారం కోరారు. కళాశాల విద్యార్థులకు వర్క్‌షాప్‌లు, పాఠశాల విద్యార్థులకు వ్యాస రచన, వక్తృత్వ పోటీలు నిర్వహించాలని సూచించారు.

News December 13, 2025

కొంతమంది సీడీపీవోలు డ్రైవర్ల ఉపాధిని దెబ్బతీస్తున్నారు: అశోక్

image

ఐసీడీఎస్ హైర్ వెహికల్స్ ఓనర్స్ అండ్ డ్రైవర్ అసోసియేషన్ ద్వితీయ వార్షికోత్సవ సమావేశం శనివారం స్థానిక DRDA మీటింగ్ హాలులో జరిగింది. రాష్ట్ర సహాయ కార్యదర్శి సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ హాజరయ్యారు. కొంతమంది సీడీపీవోలు సొంత వాహనాలను ఉపయోగించి బిల్లులు డ్రా చేసుకుంటూ డ్రైవర్ల ఉపాధిపై దెబ్బతీస్తున్నారని ఆయన ఆరోపించారు.

News December 13, 2025

VZM: గుండె ఆగింది… కానీ చూపు కొనసాగింది

image

కంటి వైద్య పరీక్షల కోసం వెళ్లిన ఓ వృద్ధుడు అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందారు. అయినా ఆయన కుటుంబం అంత శోకంలోనూ మానవీయతను చాటింది. చీపురుపల్లికి చెందిన రిటైర్డ్ డిప్యూటీ ఎంపీడీఓ కర్రోతు అప్పారావు (73) శుక్రవారం కంటి పరీక్షల కోసం విజయనగరానికి వెళ్లి అక్కడే కన్నుమూశారు. ఈ విషాదంలోనూ కుటుంబసభ్యులు నేత్రదానానికి అంగీకరించారు. రెడ్‌క్రాస్, మానవీయత స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో కార్నియా సేకరించారు.