News February 3, 2025

నేడు లోక్‌సభ ముందుకు ‘వక్ఫ్ సవరణ బిల్లు-2024’

image

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ‘వక్ఫ్ సవరణ బిల్లు-2024’పై జేపీసీ నివేదిక ఇవాళ లోక్‌సభ ముందుకు రానుంది. జేపీసీ ఛైర్మన్ జగదాంబిక పాల్ 14 సవరణలతో కూడిన నివేదికను పార్లమెంటులో సమర్పించనున్నారు. ఆ తర్వాత దీనిపై ఓటింగ్ నిర్వహించి ఆమోదించే అవకాశం ఉంది. వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని తీసుకురావడమే ఈ బిల్లు ఉద్దేశం. అయితే ఈ సవరణలపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

Similar News

News March 26, 2026

చరణ్‌‌కు సర్జరీ.. వైద్యుడికి చిరు థాంక్స్

image

‘పెద్ది’ చిత్ర షూటింగ్‌లో యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా హీరో రామ్ చరణ్ కంటిరెప్ప పైభాగంలో చిన్న గాయమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సకాలంలో శస్త్రచికిత్స చేసిన డాక్టర్ సుధాకర్ ప్రసాద్‌కు మెగాస్టార్ చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. ‘మీరు నైపుణ్యంతో చేసిన సర్జరీ మాకు నిజంగా ఓ వరంలాంటిది. ఆ సమయంలో మేమెంతో ఆందోళన చెందినా మీ నైపుణ్యం దానిని తొలగించింది. మీకు కృతజ్ఞులం’ అని చిరు ట్వీట్ చేశారు.

News March 26, 2026

మార్కాపురం ప్రమాదంపై మోదీ దిగ్భ్రాంతి

image

AP: మార్కాపురం బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ₹2లక్షలు.. గాయపడ్డ వారికి ₹50వేల చొప్పున నష్టపరిహారం అందజేస్తామన్నారు. కాగా ఈ ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సానుభూతి తెలిపారు. ఏపీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ బాధిత కుటుంబాలకు సహకారం అందించాలని సీఎస్‌ను ఆదేశించారు. మరోవైపు ఈ ఘటనపై సంతాపం తెలిపిన జగన్ ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

News March 26, 2026

దావోస్ పర్యటనల్లో రూ.2.19 లక్షల కోట్ల పెట్టుబడులు: శ్రీధర్ బాబు

image

TG: 2024, 2025 దావోస్ పర్యటనల్లో రూ.2.19 లక్షల కోట్ల పెట్టుబడులకు 44 కంపెనీలతో MOU చేసుకున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ఈ సంస్థల గ్రౌండింగ్ వివిధ దశల్లో ఉందని అసెంబ్లీలో తెలిపారు. వీటివల్ల 68,150 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుందని చెప్పారు. ‘రూ.81,800 కోట్ల పెట్టుబడికి సంబంధించి 6 కంపెనీలకు భూములు కేటాయించాం. దీనివల్ల ప్రభుత్వానికి రూ.1,540 కోట్ల ఆదాయం సమకూరింది’ అని వివరించారు.