News February 22, 2025

ఒక్క గంట నడిస్తే 6 గంటల ఆయుష్షు పెరుగుద్ది!

image

నడక ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెప్తున్నా కొందరు అడుగు తీసి అడుగేయరు. తాజా అధ్యయనంలో రోజులో ఒక గంట నడిస్తే 6 గంటల ఆయుష్షు పెరుగుతుందని తేలింది. సాధారణ వ్యక్తులు తమ పనికి మరో గంట నడకను జోడిస్తే 6.3 గంటల ఆయుష్షును పెంచుకున్నట్లేనని వెల్లడైంది. నడక కండరాల బలాన్ని & ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని వైద్యులు చెబుతున్నారు. అధిక బరువు, డయాబెటిస్, గుండెపోటు తగ్గించేందుకు నడక అవసరమంటున్నారు. SHARE IT

Similar News

News October 25, 2025

పశుగ్రాస విత్తనాలు, పశుగణ బీమాకు నిధులు విడుదల

image

AP: పశుగణ బీమా, నాణ్యమైన పశుగ్రాస విత్తనాల ఉత్పత్తికి గాను రాష్ట్ర ప్రభుత్వం రూ.3.39 కోట్ల నిధులను మంజూరు చేసింది. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్(NLM) కింద ఈ నిధులను విడుదల చేశారు. ఈ నిధులను ఇతర పథకాలకు మళ్లించకూడదని రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత శాఖకు స్పష్టం చేసింది. ఈ మేరకు పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.

News October 25, 2025

సౌదీకి సైన్యాన్ని అద్దెకివ్వనున్న పాకిస్థాన్

image

ఇటీవల పాకిస్థాన్, సౌదీ మధ్య రక్షణ ఒప్పందం కుదరడం తెలిసిందే. ఎవరు దాడి జరిపినా ఇరు దేశాలూ ఎదుర్కోవాలని నిర్ణయించాయి. అయితే దీనిలో అసలు రహస్యం పాకిస్థాన్ తన సైన్యాన్ని అద్దెకు ఇవ్వనుండడం. 25వేల మంది సైనికుల్ని పాక్ సౌదీకి పంపనుంది. దానికి ప్రతిగా సౌదీ ₹88వేల CR ప్యాకేజీని పాక్‌కు అందిస్తుంది. పాక్ ఇప్పటికే రాజకీయ, ఆర్థిక సంక్షోభంతో అనేక రుణాలు తీసుకుంటోంది. అవీ సరిపోక ఈ అద్దె విధానాన్ని ఎంచుకుంది.

News October 25, 2025

భారత్ త్రిశూల విన్యాసాలు.. పాక్ నోటమ్ జారీ

image

పాక్ బార్డర్‌లోని సర్ క్రీక్ ప్రాంతంలో ఈనెల 30 నుంచి NOV 10 వరకు భారత త్రివిధ దళాలు త్రిశూల సైనిక విన్యాసాలు నిర్వహించనున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న భారత్ NOTAM జారీ చేసింది. దీంతో పాక్ కూడా తమ సెంట్రల్, సదరన్ ఎయిర్‌స్పేస్‌‌లలో విమానాల రాకపోకలను రద్దు చేస్తూ నోటమ్ జారీ చేసింది. ఇందుకు ప్రత్యేకంగా కారణాలేవీ వెల్లడించలేదు. కాగా త్రిశూల విన్యాసాల వెనుక భారత వ్యూహమేంటని తీవ్ర ఉత్కంఠ నెలకొంది.