News November 6, 2024

WALKING: ఉదయమా.. సాయంత్రమా.. ఎప్పుడు నడవాలి?

image

ప్రతి రోజూ కనీసం 8 వేల అడుగులైనా వేస్తే ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తెల్లవారుజామున నడిస్తే మనసు ఆహ్లాదపడుతుంది. సృజనాత్మకత పెరుగుతుంది. కొవ్వు కరిగి శక్తిగా మారుతుంది. అలాగే సాయంత్రం వాకింగ్ చేస్తే ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. జీర్ణ సమస్యలు తగ్గి రాత్రి మంచి నిద్ర పడుతుంది. కాగా ఉదయం నడిచినా, సాయంత్రం నడిచినా ఆరోగ్యానికి మేలే. మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు వాకింగ్ చేయండి.

Similar News

News January 12, 2026

ఢిల్లీపై గుజరాత్ సూపర్ విక్టరీ

image

WPL-2026: ఢిల్లీతో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచులో గుజరాత్‌ విజయం సాధించింది. 210 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీ 205 రన్స్ చేసింది. చివరి ఓవర్లో DC 7 పరుగులు చేయాల్సి ఉండగా సోఫీ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అద్భుతంగా బౌలింగ్ చేసి రెండు వికెట్లు తీసి 2 రన్స్ మాత్రమే ఇచ్చారు. 18, 19వ ఓవర్లలో జెమీమా సేన 41 రన్స్ చేసినా ప్రయోజనం లేకపోయింది. ఇది గుజరాత్‌కు రెండో విజయం.

News January 12, 2026

దేశానికి మోదీనే రక్షణ గోడ: ముకేశ్ అంబానీ

image

ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి నెలకొన్నా PM మోదీ వల్ల ఇండియా సురక్షితంగా ఉందని రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ అన్నారు. ఈ సవాళ్లు భారత ప్రజలను ఇబ్బందిపెట్టలేవని, ఎందుకంటే నరేంద్ర మోదీ అనే అజేయ రక్షణ గోడ ఉందని కొనియాడారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇప్పుడు చూస్తున్న ఆశ, ఆత్మవిశ్వాసం, ఉత్సాహాన్ని గతంలో ఎన్నడూ చూడలేదని చెప్పారు. రాబోయే ఐదేళ్లలో గుజరాత్‌లో ₹7 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు.

News January 12, 2026

మరోసారి పాక్ డ్రోన్ల కలకలం

image

సరిహద్దుల్లో మరోసారి పాకిస్థాన్ డ్రోన్లు కలకలం రేపాయి. జమ్మూకశ్మీర్‌లోని నౌషేరా సెక్టార్‌లో LoC వెంబడి ఇవాళ సాయంత్రం ఓ డ్రోన్ చక్కర్లు కొట్టింది. దీంతో ఆర్మీ ఫైరింగ్ స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. తర్వాత మరికొన్ని కనిపించినట్లు ఆర్మీ వర్గాలు చెప్పాయి. ఆయుధాలు/డ్రగ్స్ జారవిడిచారనే అనుమానంతో సెర్చ్ చేస్తున్నట్లు చెప్పాయి. సాంబా సెక్టార్‌లో నిన్న డ్రోన్ ద్వారా పాక్ వెపన్స్ <<18815524>>డ్రాప్ చేయడం<<>> తెలిసిందే.