News November 6, 2024

WALKING: ఉదయమా.. సాయంత్రమా.. ఎప్పుడు నడవాలి?

image

ప్రతి రోజూ కనీసం 8 వేల అడుగులైనా వేస్తే ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తెల్లవారుజామున నడిస్తే మనసు ఆహ్లాదపడుతుంది. సృజనాత్మకత పెరుగుతుంది. కొవ్వు కరిగి శక్తిగా మారుతుంది. అలాగే సాయంత్రం వాకింగ్ చేస్తే ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. జీర్ణ సమస్యలు తగ్గి రాత్రి మంచి నిద్ర పడుతుంది. కాగా ఉదయం నడిచినా, సాయంత్రం నడిచినా ఆరోగ్యానికి మేలే. మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు వాకింగ్ చేయండి.

Similar News

News January 21, 2026

భూముల మార్కెట్ విలువలు పెంపు!

image

AP: రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో భూముల <<13263246>>మార్కెట్ విలువలు<<>> పెరగనున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి సవరించిన కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 2025 ఫిబ్రవరిలోనూ అన్ని ప్రాంతాల్లో మార్కెట్ విలువలు పెంచింది. <<7981895>>గతేడాది<<>> కొత్త జిల్లా కేంద్రాలు, వాణిజ్య ప్రాంతాల్లో 15-25% పెరిగాయి. దీంతో ప్రభుత్వానికి నవంబర్ వరకు ₹7 వేల కోట్ల ఆదాయం వచ్చింది. ఇప్పుడు ఎంత మేర పెంచుతారనే దానిపై త్వరలో క్లారిటీ రానుంది.

News January 21, 2026

రాష్ట్రంలో 220 పోస్టులు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

image

ఏపీ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌లో 220 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి పీజీ (MD/MS/DNB/DrNB/DM/MCh) ఉత్తీర్ణులు అర్హులు. వయసు 18 నుంచి 42ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. నెలకు రూ.68,900-రూ.2,05,500 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://apchfw.ap.gov.in * మరిన్ని ఉద్యోగాల కోసం<<-se_10012>> జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.

News January 21, 2026

ప్రతి ఏడాది ఫాలో అప్ సదస్సు పెట్టండి.. CM ప్రతిపాదన

image

TG: ప్రతి జులైలో హైదరాబాద్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఫాలో అప్ సదస్సు నిర్వహించాలని CM రేవంత్ దావోస్‌లో ప్రతిపాదించారు. ఈ రోజుల్లో పెట్టుబడుల ఒప్పందాలు, వ్యాపార వాణిజ్య నిర్ణయాలకు ఒక సంవత్సరం చాలా ఎక్కువ సమయమని.. అందుకే ప్రతి ఏడాది జులై/AUGలో ఫాలో-అప్ ఫోరం నిర్వహించాలని WEF​ ప్రతినిధులకు సూచించారు. ఇటీవల తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ రూ.5.75 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు ఆకర్షించిందని సీఎం గుర్తు చేశారు.