News March 17, 2024
వాంకిడి: సైబర్ వలలో చిక్కి మోసపోయిన వ్యక్తి

మండలంలోని పిప్పర గొంది గ్రామానికి చెందిన రాథోడ్ చంద్రకాంత్ సైబర్ వలలో చిక్కుకొని డబ్బులు పోగొట్టుకున్నాడు. సోషల్ మీడియాలో కారు ధర తక్కువగా ఉన్నదని ప్రకటన రావడంతో రూ.1,43,000 చెల్లించినట్లు వాంకిడి ఎస్ఐ సాగర్ తెలిపారు. వారి నుంచి ఎలాంటి సమాదానం రాకపోవడంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.
Similar News
News January 27, 2026
ఎన్నికల నిబంధనలు పకడ్బందీగా పాటించాలి: కలెక్టర్

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా సూచించారు. మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల నిర్వహణపై రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులకు కలెక్టరేట్లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈనెల 28 నుంచి ప్రారంభమయ్యే నామినేషన్ ప్రక్రియ దృష్ట్యా, నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ, గుర్తుల కేటాయింపులో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
News January 27, 2026
రెచ్చగొట్టే ప్రచారంపై కఠిన చర్యలు: డీఎస్పీ

ఆదిలాబాద్ పట్టణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాలో గెలుపోటములపై రెచ్చగొట్టే పోస్టులు, వ్యక్తులను కించపరిచే వ్యాఖ్యలు చేయడం చట్టరీత్య నేరమని డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి హెచ్చరించారు. అనుమతులు లేకుండా ఫ్లెక్సీలు, తప్పుడు సర్వేలు, అసత్య ప్రచారాలు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. సోషల్ మీడియా పర్యవేక్షణకు ప్రత్యేక నిఘా సెల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
News January 27, 2026
లక్ష్యాలను సాధించని సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు: DMHO

సకాలంలో నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేయాలని ఏ ఒక్క రోగిని వదలకుండా వైద్య పరీక్షలు నిర్వహించి రోగుల వివరాలను అంతర్జాలంలో నమోదు చేయాలని జిల్లా వైద్యశాఖ అధికారి డా.నరేందర్ రాథోడ్ అన్నారు. మంగళవారం DMHO కార్యాలయ సమావేశ మందిరంలో ఏంఎల్.హెచ్.పీ, ఏఎన్ఎంలతో అసాంక్రమిత వ్యాధుల పై సమీక్ష సమావేశం నిర్వహించారు. లక్ష్యాలను సాధించని సిబ్బందిపై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలను తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.


