News May 10, 2024
విధ్వంసం కావాలా? అభివృద్ధి కావాలా?: చంద్రబాబు

వైసీపీ పాలనలో ఏపీ దిక్కులేని రాష్ట్రంగా మారిందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ఒంగోలులో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. ‘వైసీపీ అవినీతి, దోపిడీ, కబ్జాలు, అరాచకాలకు ముగింపు పలకాలి. జగన్ ప్రభుత్వం వల్ల అన్ని విషయాల్లో నష్టపోయాం. ఐదేళ్లలో ఒక్క మంచి పని చేశారా? విధ్వంస పాలన కావాలా? అభివృద్ధి పాలన కావాలా? ప్రజలు తేల్చుకోవాలి’ అని సూచించారు.
Similar News
News November 11, 2025
EXIT POLLS: బిహార్లో NDAకే పట్టం!

ఓట్ చోరీ సహ అనేక ప్రభుత్వ వ్యతిరేకాంశాలను ప్రచారం చేసినా బిహార్ ప్రజలు ఎన్నికల్లో అధికార NDA కూటమికే పట్టం కడుతున్నట్లు ఎగ్జిట్ పోల్ సర్వేలు తేలుస్తున్నాయి. దైనిక్ భాస్కర్ నిర్వహించిన సర్వేలో NDAకి 145-160 సీట్లు, MGBకి 73-91 సీట్లు వస్తాయని అంచనా వేసింది. JVC-టైమ్స్ నౌ NDAకి 135-150, MGBకి 88-103 సీట్లు వస్తాయని తెలిపింది. మ్యాట్రిజ్-IANS NDAకి 147-167, MGBకి 70-90 సీట్లు దక్కుతాయని పేర్కొంది.
News November 11, 2025
₹12.92 ట్రిలియన్లకు పెరిగిన ప్రత్యక్ష పన్నుల ఆదాయం

కేంద్ర ప్రత్యక్ష పన్నుల ఆదాయం గతంతో పోలిస్తే 7% పెరిగి ₹12.92 ట్రిలియన్లకు చేరింది. APR 1-NOV 10 వరకు వచ్చిన ఆదాయ వివరాలను ప్రభుత్వం వెల్లడించింది. గత ఏడాది ఇదే కాలానికి ₹12.08 ట్రిలియన్లు వచ్చాయి. రిఫండ్లు గత ఏడాది కన్నా 18% తగ్గి ₹2.42 ట్రిలియన్లుగా ఉన్నాయి. FY 2025-26కి ₹25.20 ట్రిలియన్ల డైరెక్ట్ ట్యాక్స్ ఆదాయాన్ని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గత ఏడాది ఆదాయం కన్నా ఇది 12.7% అధికం.
News November 11, 2025
లేటెస్ట్ అప్డేట్స్

⋆ విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేసిన NIA.. సిరాజ్ ఉర్ రెహమాన్(VZM), సయ్యద్ సమీర్(HYD) యువతను టెర్రరిజంవైపు ప్రేరేపించేలా కుట్ర పన్నారని అభియోగాలు
⋆ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న పిటిషన్పై వెనక్కి తగ్గిన YS జగన్.. NOV 21లోగా CBI కోర్టులో హాజరవుతానని స్పష్టీకరణ.. యూరప్ వెళితే NOV 14లోగా కోర్టులో హాజరుకావాలని గతంలో ఆదేశించిన కోర్టు
* జూబ్లీహిల్స్లో 50.16% ఓటింగ్ నమోదు


