News May 10, 2024

విధ్వంసం కావాలా? అభివృద్ధి కావాలా?: చంద్రబాబు

image

వైసీపీ పాలనలో ఏపీ దిక్కులేని రాష్ట్రంగా మారిందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ఒంగోలులో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. ‘వైసీపీ అవినీతి, దోపిడీ, కబ్జాలు, అరాచకాలకు ముగింపు పలకాలి. జగన్ ప్రభుత్వం వల్ల అన్ని విషయాల్లో నష్టపోయాం. ఐదేళ్లలో ఒక్క మంచి పని చేశారా? విధ్వంస పాలన కావాలా? అభివృద్ధి పాలన కావాలా? ప్రజలు తేల్చుకోవాలి’ అని సూచించారు.

Similar News

News April 6, 2026

డ్రైవింగ్ లైసెన్స్ జారీకి త్వరలో కొత్త నిబంధన!

image

TG: డ్రైవింగ్ లైసెన్స్ మంజూరుకు త్వరలో రోడ్ సేఫ్టీ టెస్టును తప్పనిసరి చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లెర్నర్ లైసెన్స్ రిజిస్ట్రేషన్ టెస్ట్, డ్రైవింగ్ స్కిల్ టెస్ట్ నిర్వహించి లైసెన్స్ ఇస్తున్నారు. ఇక నుంచి వీటి కంటే ముందు రోడ్ సేఫ్టీ టెస్ట్ నిర్వహించాలని ఆర్టీఏ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీనిపై ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. కమిటీ నివేదిక వచ్చాక కొత్త రూల్ అమల్లోకి వచ్చే అవకాశముంది.

News April 6, 2026

IPL: ఈరోజైనా KKR బోణీ కొడుతుందా?

image

ఐపీఎల్-2026లో ఈరోజు రా.7.30 గంటలకు కోల్‌కతా వేదికగా KKR, PBKS తలపడనున్నాయి. టోర్నీ చరిత్రలో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 35 మ్యాచులు ఆడగా 21 విజయాలతో KKR పైచేయి సాధించింది. కానీ ప్రస్తుత సీజన్‌లో KKR ఫామ్‌లో లేదు. ఇప్పటివరకు రెండు మ్యాచులాడి రెండింట్లోనూ ఓడింది. అటు పంజాబ్ ఆడిన 2 మ్యాచుల్లోనూ గెలిచి అన్ని విభాగాల్లో దూసుకుపోతోంది. మరి ఈరోజు విజయం ఎవరిదో కామెంట్ చేయండి.

News April 6, 2026

లేఆఫ్స్‌ వద్దు.. రీస్కిల్లింగ్‌పై దృష్టి పెట్టండి: NITES

image

టెక్ కంపెనీలు లేఆఫ్స్‌కు బదులు ఉద్యోగుల స్కిల్స్‌ను పెంచడంపై దృష్టి పెట్టాలని IT ఉద్యోగుల సంఘం ‘నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్’ అభిప్రాయపడింది. లేఆఫ్స్‌ను చివరి ఆప్షన్‌గా చూడాలంది. ప్రైవేట్ సెక్టార్‌లో లే ఆఫ్స్, నోటీస్ పీరియడ్స్, పరిహారాలకు సంబంధించి స్పష్టమైన నిబంధనలు లేవని, ప్రభుత్వాలు జోక్యం చేసుకొని ఉద్యోగుల హక్కులను కాపాడాలని సంఘం ప్రెసిడెంట్ హర్‌ప్రీత్ సింగ్ సలూజా కోరారు.