News October 25, 2024
మొబైల్ ఫోన్ త్వరగా ఛార్జ్ కావాలంటే?

ఆధునిక ప్రపంచంలో మొబైల్ మన జీవితంలో ఓ భాగమైంది. అలాంటి మొబైల్ త్వరగా ఛార్జ్ అవ్వాలంటే కొన్ని ట్రిక్స్ పాటిస్తే చాలు. అవేంటంటే.. ఛార్జింగ్లో ఉన్నప్పుడు మొబైల్ను షేక్ చేయొద్దు. ఛార్జ్ చేసే ముందు రన్నింగ్ యాప్స్, ఇంటర్నెట్ ఆఫ్ చేయాలి. 40శాతం కన్నా తక్కువ ఛార్జింగ్ ఉన్నప్పుడే ఛార్జ్ చేయడం ఉత్తమం. బ్రైట్నెస్ తగ్గించుకొని ఉపయోగించుకోవాలి. స్విచాఫ్ చేసి ఛార్జ్ చేస్తే త్వరగా ఎక్కుతుంది.
Similar News
News November 13, 2025
రోడ్లకు నేతల పేర్లకు బదులు కంపెనీల పేర్లు: సీఎం

TG: దేశంలో రోడ్లకు ఎక్కువగా నేతల పేర్లు ఉన్నాయని, హైదరాబాద్లో తాము ఆ ట్రెండ్ను మార్చాలనుకుంటున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ముఖ్యమైన రోడ్లకు గూగుల్, మెటా, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీ పేర్లను పెడతామని అన్నారు. ఢిల్లీలో జరిగిన US-India సమ్మిట్లో సీఎం పాల్గొన్నారు. 30 వేల ఎకరాల్లో ‘ఫ్యూచర్ సిటీ’, మూసీ పునరుజ్జీవనం, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్ ప్రాజెక్టులు చేపట్టామన్నారు.
News November 13, 2025
సింగరేణిలో 82 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

సింగరేణిలో 82 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్నల్ అభ్యర్థులతో ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 24లోగా అప్లై చేసుకోవాలి. దరఖాస్తు హార్డ్ కాపీని ఈనెల 26లోగా పంపాలి. బేసిక్ శాలరీ నెలకు రూ.50,000 చెల్లిస్తారు. వెబ్సైట్: scclmines.com
News November 13, 2025
ప్రతి కశ్మీరీ ముస్లిం టెర్రరిస్టు కాదు: J&K సీఎం

ప్రతి కశ్మీరీ ముస్లిం టెర్రరిస్టు కాదని జమ్మూకశ్మీర్ CM ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఢిల్లీ పేలుడు ఘటనను ఆయన ఖండించారు. అమాయకులను క్రూరంగా చంపడాన్ని ఏ మతమూ సమర్థించదని తెలిపారు. కశ్మీర్లో శాంతి, సోదరభావాన్ని నాశనం చేసేవారు కొందరు ఉంటారని విమర్శించారు. బ్లాస్ట్ కారకులను కఠినంగా శిక్షించాలని, అమాయకులను వదిలేయాలని కోరారు. ఓ డాక్టర్ను <<18268521>>ఉద్యోగం నుంచి తొలగించాక<<>> దర్యాప్తు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.


