News August 9, 2024

ఆ బాలీవుడ్ హీరోతో నటించాలని ఉంది: రామ్ పోతినేని

image

తనకు బాలీవుడ్‌లో రణబీర్ కపూర్‌తో కలిసి పనిచేయాలని ఉందని హీరో రామ్ పోతినేని అన్నారు. ‘సంజూ’ మూవీలో రణబీర్ చేసిన సంజయ్ దత్ పాత్ర అంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు. ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ ప్రమోషన్లలో ఆయన మాట్లాడారు. అవకాశమొస్తే అతనితో కలిసి నటిస్తానని రామ్ తెలిపారు. ‘డబుల్ ఇస్మార్ట్’కు A సర్టిఫికెట్ రాగా 2 గంటల 42 నిమిషాల నిడివి ఉంటుందని సమాచారం. ఈ నెల 15న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.

Similar News

News December 25, 2025

అనూహ్య రద్దీ.. శ్రీవాణి టికెట్ల జారీపై TTD కీలక నిర్ణయం

image

తిరుమలలో అనూహ్యంగా రద్దీ పెరగడంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 27, 28, 29 తేదీల్లో శ్రీవాణి ఆఫ్‌లైన్ టికెట్ల జారీని నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. తిరుమలతోపాటు రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న శ్రీవాణి టికెట్ బుకింగ్ ఆఫీసుల్లో టికెట్లు ఇవ్వరని టీటీడీ తెలిపింది. మరోవైపు శిలా తోరణం వరకు భక్తులు వేచిచూస్తున్నందున సర్వదర్శనానికి వచ్చేవారిని క్యూ లైన్లలోకి తాత్కాలికంగా అనుమతించడం లేదు.

News December 25, 2025

JAN 8న హాట్‌స్టార్‌లోకి ‘వెపన్స్’

image

సూపర్‌హిట్ హాలీవుడ్ హర్రర్ మూవీ ‘వెపన్స్’ మరో OTTలో స్ట్రీమింగ్‌కి రెడీ అవుతోంది. JAN 8 నుంచి ఫ్రీగా స్ట్రీమింగ్‌ కానున్నట్లు జియో హాట్‌స్టార్‌ ప్రకటించింది. AUGలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా కొన్ని వారాలకు అమెజాన్ ప్రైమ్, ఆపిల్ టీవీ ప్లస్, వుడు గూగుల్ వీడియోప్లేలో అద్దె విధానంలో అందుబాటులో ఉంది. రూ.335 కోట్లతో తీసిన హర్రర్ థ్రిల్లర్ రూ.2,400 కోట్లు కలెక్ట్ చేసి రికార్డులు క్రియేట్ చేసింది.

News December 25, 2025

‘రాష్ట్ర ప్రేరణా స్థల్‌’ను ప్రారంభించిన మోదీ.. ఏంటిది?

image

లక్నోలో(UP) ₹230 కోట్లతో, 65 ఎకరాల్లో నిర్మించిన ‘రాష్ట్ర ప్రేరణా స్థల్‌’ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇక్కడ శ్యామప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ, వాజ్‌పేయి కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేశారు. వారి గొప్ప ఆలోచనలు, సుపరిపాలన పాఠాలను ముందు తరాలకు అందించడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యమని ప్రధాని వివరించారు. దేశ సేవ, నాయకత్వ విలువలు, సాంస్కృతిక చైతన్యాన్ని పెంపొందించే వేదికగా ఈ కేంద్రం నిలుస్తుందన్నారు.