News April 13, 2024
యుద్ధ వాతావరణం.. ఎయిరిండియా కీలక నిర్ణయం!

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పశ్చిమాసియాలో పరిస్థితుల దృష్ట్యా ఇరాన్ గగనతలం మీదుగా ఆ సంస్థ విమానాలు ప్రయాణించట్లేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇతర మార్గాల్లో చాలా దూరం ప్రయాణించి యూరప్ వైపుగా వెళ్తున్నట్లు తెలిపాయి. ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణంతో తమ పౌరులను ఆ ప్రాంతాలకు వెళ్లొద్దని భారత్తో పాటు ఫ్రాన్స్, రష్యా కోరాయి.
Similar News
News March 11, 2026
ఆపరేషన్ హార్ముజ్.. రంగంలోకి ఇండియన్ నేవీ?

హార్ముజ్ జలసంధిలో చిక్కుకున్న భారతీయ నౌకలను సేఫ్గా తీసుకురావడానికి నేవీని పంపాలని కేంద్రం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో తమ వాణిజ్య నౌకలకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తులు రావడంతో ఈ నిర్ణయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ జలసంధిని దాటలేక ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్లో 1,100 మందికిపైగా సెయిలర్స్ ఉన్న 38 భారతీయ వాణిజ్య నౌకలు చిక్కుకున్నాయి.
News March 11, 2026
వచ్చే నెలలో Xలో పేమెంట్ ఆప్షన్?

సోషల్ మీడియా ప్లాట్ఫామ్ Xలో త్వరలో ఫోన్ పే, గూగుల్ పే తరహాలో పేమెంట్ ఆప్షన్స్ రానున్నాయి. వచ్చే నెలలో పరిమిత యూజర్లకు దీని ఎర్లీ యాక్సెస్ అందుబాటులో ఉంటుందని ఎలాన్ మస్క్ ప్రకటించారు. దీనిపై X ఇప్పటికే వీసా సంస్థతో టైయప్ అయింది. కాగా Xను SM కంటే ఫైనాన్స్కు ప్రాధాన్యం ఉన్న ప్లాట్ఫామ్గా మారుస్తానని మస్క్ గతంలో పలుమార్లు పేర్కొన్నారు. ట్రయల్స్ ఓకే అయితే ఈ ఫీచర్ అందరికీ అందుబాటులోకి వస్తుంది.
News March 10, 2026
గ్యాస్ కొరత.. మొబైల్, ఇంటర్నెట్పై ఎఫెక్ట్?

LPG కొరతతో మొబైల్, ఇంటర్నెట్ సేవలపైనా ప్రభావం పడే అవకాశం ఉంది. టెలికాం టవర్ తయారీ సంస్థలకు గ్యాస్ సప్లై నిలిచిపోవడమే ఇందుకు కారణం. టెలికం టవర్లు తుప్పుపట్టకుండా తయారీ సమయంలో జింక్తో వేసే రక్షణ పొరకు LPG/LNG అవసరం. ఈ గాల్వనైజేషన్ ప్రాసెస్కు తగిన LPG లేకపోతే ఆపరేషన్స్ నిలిపివేయాల్సి వస్తుందని తయారీదారులు చెబుతున్నారు. దీంతో నెట్వర్క్ విస్తరణ నెమ్మదించి కనెక్టివిటీపై ప్రభావం పడుతుందని తెలిపారు.


