News July 10, 2024

యుద్ధం ఏ సమస్యకూ పరిష్కారం కాదు: మోదీ

image

ప్రపంచ దేశాల సమస్యలు చర్చలతో, దౌత్య మార్గంలోనే పరిష్కృతం అవుతాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. యుద్ధం ఏ సమస్యకూ పరిష్కారం కాదన్నారు. ఆస్ట్రియా పర్యటన సందర్భంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. మూడో టర్మ్ ఆరంభంలోనే ఆస్ట్రియాలో పర్యటించే అవకాశం రావడంపై హర్షం వ్యక్తం చేశారు. ఆస్ట్రియన్ ఛాన్సెలర్ కార్ల్ నెహమ్మర్‌తో పునరుత్పాదకశక్తి, మౌలికవసతులు, నీటి నిర్వహణ మొదలైన అంశాలపై చర్చించినట్లు తెలిపారు.

Similar News

News October 18, 2025

ఏపీ న్యూస్ రౌండప్

image

* ఈ నెల 19-24 వరకు మంత్రి లోకేశ్ ఆస్ట్రేలియా పర్యటన.. వర్సిటీల్లో అధునాతన బోధనా పద్ధతులపై అధ్యయనం
* తిరుమలలో TG భక్తులను మోసం చేసిన దళారీ అశోక్.. శ్రీవారి సేవా టికెట్లు ఇప్పిస్తానని రూ.4లక్షలు కాజేసి పరారీ
* పౌరసరఫరాల శాఖపై విమర్శలు చేసిన నెల్లూరు(D)కు చెందిన కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డిపై TDP అధిష్ఠానం సీరియస్.. ఇవాళ పార్టీ కేంద్ర కార్యాలయానికి రావాలని పిలుపు

News October 18, 2025

‘డ్యూడ్’, ‘తెలుసు కదా’ చిత్రాల కలెక్షన్స్ ఇలా!

image

* ప్రదీప్ రంగనాథన్ నటించిన ‘డ్యూడ్’ మూవీకి తొలిరోజు మంచి కలెక్షన్లు వచ్చాయి. ఈ చిత్రానికి రూ.10 కోట్లకుపైగా నెట్ కలెక్షన్స్ వచ్చాయని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
* సిద్ధూ జొన్నలగడ్డ నటించిన ‘తెలుసు కదా’ సినిమాకు ఫస్ట్ డే షాకింగ్ కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది. తొలిరోజు ఇండియాలో రూ.2 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
* వీటిలో ఏ మూవీ నచ్చిందో కామెంట్ చేయండి.

News October 18, 2025

వంటింటి చిట్కాలు

image

* కిస్‌మిస్‌లు నిల్వ చేసే ముందు రెండు స్పూన్ల బియ్యప్పిండిని వాటికి పట్టిస్తే ఎన్ని రోజులైనా అతుక్కోకుండా ఉంటాయి.
* నూనె డబ్బాలు ఎంత తోమినా జిడ్డుగానే ఉంటాయి. అప్పుడు కాస్త క్రిస్టల్ సాల్ట్, డిష్ వాష్ లిక్విడ్ వేసిన నీటిలో డబ్బాను కాసేపు నానబెట్టి స్క్రబ్బర్‌తో రుద్దాలి. దీంతో జిడ్డంతాపోయి తళతళా మెరుస్తాయి.
* చేపలు శుభ్రం చేసిన తర్వాత శెనగపిండి పట్టించి 5 నిమిషాల తర్వాత కడిగితే నీచు వాసన పోతుంది.