News March 18, 2024
వరంగల్: పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_32024/1710731659402-normal-WIFI.webp)
పదోతరగతి పరీక్షలకు వేళైంది. నేటి నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు జరిగే పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతిరోజు పరీక్ష ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.30 వరకు జరుగుతుంది. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. నిమిషం నిబంధన ఎత్తివేశారు. వరంగల్ జిల్లాలో 253 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, 43,325 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు.
Similar News
News July 1, 2024
వరంగల్ మార్కెట్లో మిర్చి ధరల వివరాలు..
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719809244573-normal-WIFI.webp)
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారం వివిధ రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. ఏసీ తేజ మిర్చి ధర క్వింటా రూ.19 వేలు పలికింది. ఏసీ 341 రకం మిర్చి రూ.17,000, వండర్ హాట్(WH) మిర్చికి రూ.16,000 ధర వచ్చింది. కాగా, గత శుక్రవారంతో పోలిస్తే తెజ, 341 మిర్చిలు రూ.500 పెరగగా.. వండర్ హాట్ మిర్చి ధరలు రూ.1000 తగ్గింది.
News July 1, 2024
వరంగల్: ఈరోజు పత్తి ధర రూ.7,160
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719805707690-normal-WIFI.webp)
రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఈరోజు పునఃప్రారంభమైంది. ఈ క్రమంలో మార్కెట్కు పత్తి తరలిరాగా.. ధర మాత్రం గత వారంలాగే రూ.7,160 పలికింది. పత్తి ధర పెరగకపోవడంతో రైతన్నలు నిరాశ చెందుతున్నారు. కాగా, మార్కెట్లో కొనుగోళ్ల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంన్నది.
News July 1, 2024
MHBD: ఓ వ్యక్తి వేధింపులు.. భార్య మృతి, భర్త సీరియస్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719789863310-normal-WIFI.webp)
ఓ వ్యక్తి వేధింపులు తట్టుకోలేక భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన MHBD జిల్లా నెల్లికుదురు మం.లో ఆదివారం జరిగింది. SI క్రాంతికిరణ్ ప్రకారం.. పెద్దతండాకు చెందిన నీలమ్మను అదే గ్రామానికి చెందిన వీరన్న అనే వ్యక్తి తరచూ వేధింపులకు గురి చేస్తున్నాడు. నీలమ్మ భర్త భద్రు అవమానానికి గురై పురుగు మందు తాగగా.. నీలమ్మ సైతం ఆత్మహత్యకు పాల్పడింది. నీలమ్మ మృతి చెందగా.. భద్రు చికిత్స పొందుతున్నాడు.