News August 5, 2025

జైళ్ల శాఖలో వార్డర్ పోస్టుల భర్తీ చేపట్టాలి: అనిత

image

AP: జైళ్ల శాఖలో ఖాళీగా ఉన్న 300-400 వార్డర్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని హోంమంత్రి అనిత అధికారులను ఆదేశించారు. జైళ్లలోని పరిశ్రమలకు టెక్నాలజీ జోడించి అభివృద్ధి చేయాలని ఆదేశించారు. జైళ్లశాఖ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ‘రాష్ట్రంలో అసంపూర్తిగా నిలిచిన జైళ్ల భవనాలు పూర్తి చేయాలి. ఇందుకు నిధులు కేటాయించేందుకు కృషి చేస్తా. కొందరు అధికారులు తీరు మార్చుకోవాల్సి ఉంది’ అని ఆమె హెచ్చరించారు.

Similar News

News August 5, 2025

ప్రైవేట్ స్కూళ్లలో ఫ్రీ అడ్మిషన్స్.. ఆ రూల్ ఛేంజ్!

image

AP: ప్రైవేటు స్కూళ్లలో 25% సీట్లను ప్రభుత్వం పేద విద్యార్థులకు ఉచితంగా కేటాయిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు విద్యార్థుల ఇళ్లకు 3kmsలోపు ఉన్న స్కూళ్లలో అడ్మిషన్లు ఇచ్చారు. ఇకపై 3-5kms దూరంలో ఉన్న స్కూళ్లలోనూ కేటాయించనున్నారు. ఈ మేరకు నోటిఫికేషన్ ఇచ్చి దరఖాస్తులు తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. విద్యార్థుల తల్లులకు ఇప్పటికే ‘తల్లికి వందనం’ వచ్చి ఉంటే ఫీజులు వారే చెల్లించాలని తెలిపింది.

News August 5, 2025

కరుణ్ కెరీర్ ముగిసినట్లేనా?

image

దేశీయ టోర్నీల్లో సూపర్ ఫామ్‌తో భారత జట్టులో చోటు దక్కించుకున్న కరుణ్ నాయర్ ఇంగ్లండ్‌తో సిరీస్‌లో అంచనాలను అందుకోలేకపోయారు. ట్రిపుల్ సెంచరీ చేసిన తొమ్మిదేళ్లకు జాతీయ జట్టులోకి వచ్చిన ఆయన ఈ సిరీస్‌లో 25.63 సగటుతో 205 పరుగులే చేశారు. చివరి టెస్టులో అర్ధ సెంచరీ మినహా ఆయన పేలవ ప్రదర్శన అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. దీంతో వచ్చే సిరీస్‌లో ఆయన స్థానంలో వేరే ప్లేయర్‌కు ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు.

News August 5, 2025

2,119 ఉద్యోగాలు.. ఎల్లుండే లాస్ట్

image

ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ 2,119 ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతోంది. వార్డర్, టెక్నీషియన్, అసిస్టెంట్, పీజీటీ, ఫార్మసిస్ట్ వంటి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆయా విభాగాల్లో డిగ్రీ/పీజీ చదివినవారు అర్హులు. వయసు 18 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. వివిధ పోస్టులను అనుసరించి వేతనం రూ.19,900 నుంచి రూ.1,51,000 వరకు ఉంటుంది. ఈ నెల 7లోగా dsssbonline.nic.inలో దరఖాస్తు చేసుకోవాలి.