News December 1, 2024

వార్మప్ మ్యాచ్.. భారత్ టార్గెట్ 241

image

టీమ్ ఇండియాతో జరుగుతున్న వార్మప్ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ XI జట్టు 43.2 ఓవర్లలో 240 రన్స్‌కు ఆలౌటైంది. ఆ టీమ్‌లో సామ్ కోన్‌స్టాస్ 107, జాకబ్స్ 61, క్లేటన్ 40 రన్స్‌తో రాణించారు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా 4, ఆకాశ్ దీప్ 2 వికెట్లు తీయగా, సిరాజ్, ప్రసిద్ధ్, సుందర్, జడేజా తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచులో గెలవాలంటే భారత్ 46 ఓవర్లలో 241 రన్స్ చేయాలి.

Similar News

News November 20, 2025

జగన్ జైలుకెళ్లడం ఖాయం: మంత్రి సత్యకుమార్

image

AP: పెయిడ్ ఆర్టిస్టులతో జగన్ కోర్టులను మభ్యపెట్టలేరని మంత్రి సత్యకుమార్ యాదవ్ మండిపడ్డారు. ‘విచారణలో భాగంగా కోర్టులకు హాజరయ్యేవారు వినయంగా వ్యవహరిస్తారు. తాను కోర్టుకు హాజరైతే సమస్యలు ఎదురవుతాయని కోర్టును నమ్మబలికే ప్రయత్నంలో భాగంగానే HYDలో నానా హంగామా చేశారు. జగన్‌లో ఎటువంటి పశ్చాత్తాపం కనిపించడం లేదు. అక్రమాస్తుల కేసులో ఆయన జైలుకు వెళ్లడం ఖాయం’ అని మంత్రి వ్యాఖ్యానించారు.

News November 20, 2025

పొగిడిన నోళ్లే తిడుతున్నాయ్.. కరెక్టేనా?

image

రాజమౌళి.. మొన్నటి వరకు తెలుగు సినీ కీర్తిని ప్రపంచ వేదికపై రెపరెపలాడించిన వ్యక్తి. బాలీవుడ్‌ ఆధిపత్యాన్ని ఎదురించి సౌత్ సినిమాను దేశవ్యాప్తం చేసిన డైరెక్టర్. కానీ ఇప్పుడు.. ఆస్కార్ తెచ్చాడని పొగిడిన నోళ్లే నేలకు దించేస్తున్నాయి. ప్రశంసించిన వాళ్లే విమర్శిస్తున్నారు. ‘దేవుడిపై పెద్దగా నమ్మకం లేదు’ అన్న ఒకేఒక్క మాట జక్కన్నను పాతాళానికి పడేసిందా? అంతరాత్మ ప్రభోదానుసారం మాట్లాడటం తప్పంటారా? COMMENT

News November 20, 2025

ఎదురుపడ్డా పలకరించుకోని జగన్-సునీత!

image

అక్రమ ఆస్తుల కేసులో AP మాజీ సీఎం జగన్ ఇవాళ HYD నాంపల్లి CBI కోర్టుకు హాజరైన విషయం తెలిసిందే. ఈ సమయంలో ఆయన బాబాయి వివేకానందరెడ్డి కుమార్తె సునీత కూడా కోర్టులోనే ఉన్నారు. తన తండ్రి హత్యకేసులో సీబీఐ విచారణ కొనసాగించాలని దాఖలు చేసిన పిటిషన్ వాదనల నేపథ్యంలో ఆమె న్యాయస్థానానికి హాజరయ్యారు. కోర్టు ప్రాంగణంలో అన్నాచెల్లెళ్లు ఎదురు పడినా ఒకరినొకరు పలకరించుకోలేదని, ఎవరో తెలియనట్లు వ్యవహరించినట్లు సమాచారం.