News April 6, 2024

హెచ్చరిక.. ఈ సమయంలో బయటకు రావొద్దు

image

TG: రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువైన నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నేడు, రేపు వడగాడ్పులు వీచే అవకాశం ఉండటంతో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ప్రజలు బయటకు రావొద్దని వార్నింగ్ ఇచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ నెల 7 తర్వాత ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్నారు.

Similar News

News December 1, 2025

ఆ డాక్టర్లకు 50శాతం ఇన్సెంటివ్!

image

TG: గిరిజన జిల్లాల్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రొఫెసర్లు, టీచింగ్ ఫ్యాకల్టీకి బేసిక్ పేలో 50% అదనపు ఇన్సెంటివ్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ట్రైబల్ ఏరియాకు వెళ్లేందుకు డాక్టర్లు ఇష్టపడట్లేదు. ఫలితంగా కాలేజీల్లో ఫ్యాకల్టీ కొరత ఏర్పడి గుర్తింపు కోల్పోయే ప్రమాదముంది. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. భద్రాద్రి, ఆసిఫాబాద్, MLG, MHBD, భూపాలపల్లి కాలేజీలు గిరిజన ప్రాంతాల పరిధిలోకి వస్తాయి.

News December 1, 2025

శ్రీకాంత్ మాల్డే, చార్మి బిజినెస్ సక్సెస్ సీక్రెట్ ఇదే

image

శ్రీకాంత్, చార్మి ఎప్పుడూ సాదా సీదా జీవితాన్ని గడపడం, కల్తీలేని ఆర్గానిక్ పద్ధతిని ఎంచుకోవడం, వినియోగదారులతో నిజాయితీగా వ్యవహరించడం చుట్టు పక్కల జనానికి, వారి దగ్గర పాల ఉత్పత్తులను కొనేవారికి బాగా నచ్చింది. ముఖ్యంగా మౌత్ పబ్లిసిటీతోనే వారి వ్యాపారం బాగా జరిగింది. ఫలితంగా రోజురోజుకీ వారి ఉత్పత్తులకు డిమాండ్ పెరిగి 2024 నాటికే రూ.2 కోట్ల టర్నోవర్ సాధించి, ఇప్పుడు మరింత ఆదాయం దిశగా దూసుకెళ్తున్నారు.

News December 1, 2025

పలు జిల్లాల్లో భారీ వర్షాలు

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాలపై దిత్వా తుఫాను ప్రభావం ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. ఇవాళ ఖమ్మం, భద్రాద్రి, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని పేర్కొంది. రానున్న 3 రోజులు చలి గాలులు అధికంగా వీచే అవకాశముందని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను హెచ్చరించింది. అర్ధరాత్రి నుంచి భద్రాద్రి, ఖమ్మం, ఆసిఫాబాద్, నల్గొండ తదితర జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో జల్లులు పడుతున్నాయి.