News April 3, 2024
WARNING: బయటకు రాకండి

తెలుగు రాష్ట్రాల్లో భానుడు మండిపోతున్నాడు. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. నిర్మల్ జిల్లా నర్సాపూర్ గ్రామంలో అత్యధికంగా 43.5 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. రాయలసీమ, తెలంగాణలో తీవ్ర వడగాల్పులు వీస్తున్నాయి. సాధారణం కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Similar News
News December 23, 2025
లిక్కర్ కిక్కు.. దక్షిణాదిలో తెలంగాణ టాప్!

దక్షిణాదిలో మద్యం వినియోగంలో తెలంగాణ టాప్లో నిలిచినట్లు ఎక్సైజ్ అంచనాల్లో తేలింది. సగటున తలసరి ఆల్కహాల్ వినియోగం 4.44 లీటర్లు. తర్వాతి స్థానాల్లో కర్ణాటక(4.25L), తమిళనాడు(3.38L), AP(2.71L), కేరళ (2.53L) ఉన్నాయి. యావరేజ్గా తెలంగాణలో మద్యం తాగేందుకు తలసరి ఖర్చు ₹11,351 కాగా, APలో ₹6,399 వెచ్చిస్తున్నారు. ఒక రాష్ట్రంలో ఏడాదిలో అమ్ముడైన మొత్తం మద్యం, జనాభా ఆధారంగా తలసరి వినియోగాన్ని అంచనా వేస్తారు.
News December 23, 2025
ఆయిల్పామ్.. అంతర పంటలతో అదనపు ఆదాయం

ఆయిల్పామ్ మొక్కలు తొలి మూడేళ్లు చిన్నవిగా ఉంటాయి కాబట్టి అంతర పంటలను సాగుతో అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. కొత్తగా నాటిన మొక్కల చుట్టూ జనుము, జీలుగా, పెసర, అపరాలను 5 నుంచి 6 వరుసలుగా విత్తుకోవాలి. దీంతో తేమ ఆరిపోకుండా ఉంటుంది. కోకో, కూరగాయలు, పొట్టి అరటి, పూల మొక్కలు, మిర్చి, పసుపు, అల్లం, అనాస, మొక్కజొన్న వంటి అంతర పంటలను సాగు చేసి అదనపు ఆదాయం పొందవచ్చు.
News December 23, 2025
GAIL(INDIA)లిమిటెడ్లో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

<


