News April 11, 2024
ఐఫోన్ యూజర్లకు వార్నింగ్!

యూజర్లకు ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్ హెచ్చరికలు జారీ చేసింది. ‘మెర్సెనరీ స్పైవేర్’ ద్వారా సైబర్ దాడులు జరిగే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చింది. భారత్తో సహా 91 దేశాల యూజర్లకు ఈ ప్రమాదం పొంచి ఉందని పేర్కొంది. గత ఏడాది రాజకీయ ప్రతినిధులకు సైబర్ దాడులు పొంచి ఉన్నాయని యాపిల్ పంపిన వార్నింగ్ నోటిఫికేషన్ చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.
Similar News
News March 3, 2026
హోలీ ఆఫర్ల పేరుతో లింక్స్.. క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ!

TG: హోలీ పండగను క్యాష్ చేసుకునేందుకు సైబర్ కేటుగాళ్లు రెడీ అయ్యారు. రంగులు, గిఫ్ట్స్, ఈవెంట్ పాస్ల మీద భారీ డిస్కౌంట్లు ఉన్నాయంటూ వాట్సాప్, SMSలలో ఫేక్ లింకులు పంపుతున్నారు. వీటిపై క్లిక్ చేస్తే మీ ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ హెచ్చరించారు. పొరపాటున మోసపోతే వెంటనే 1930 నంబర్కు కాల్ చేయాలని ఆమె సూచించారు.
News March 3, 2026
రాష్ట్రంలో మళ్లీ వర్షాలు!

AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆవరించిన ఉపరితల ఆవర్తనం 4 రోజుల్లో ఉపరితల ద్రోణిగా విస్తరించే ఆస్కారముందని వాతావరణశాఖ తెలిపింది. దీంతో ఈ నెల 7వ తేదీ తర్వాత కోస్తాంధ్రలో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. రానున్న 24 గంటల్లో రాష్ట్రంలోని చాలాచోట్ల ఎండ తీవ్రత ఉంటుందని హెచ్చరించింది. అయినా అల్లూరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో పొగమంచు కురుస్తుందని చెప్పింది. ఇక నిన్న దేశంలోనే కర్నూలులో అత్యధికంగా 38°C నమోదైంది.
News March 3, 2026
‘హెడ్’ పోయినా పోరాడుతోంది!

సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించినా యుద్ధంలో ఇరాన్ వెనక్కి తగ్గడం లేదు. అమెరికా-ఇజ్రాయెల్కు దీటుగా బదులిస్తూ వాటికి సహకరించిన గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తోంది. ఈ పని అంతా ఇరాన్ సెక్యూరిటీ ఫోర్సెస్ విభాగంలోని ఇస్లామిక్ రెవెల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్(IRGC) చేస్తోంది. ఇందులో సుమారు 1.50 లక్షల మంది సైన్యం ఉంటుంది. అల్టిమేట్గా ఖమేనీ దీనికి హెడ్గా ఉండేవారు. IRGC కమాండర్ ఇన్ చీఫ్ కూడా హతమయ్యారు.


