News October 10, 2024

Microsoft Edge యూజర్లకు వార్నింగ్

image

Microsoft Edge యూజర్లకు కేంద్రం వార్నింగ్ ఇచ్చింది. బ్రౌజర్‌ను వెంటనే అప్డేట్ చేసుకోవాలంది. 129.0.2792.79 ముందు వెర్షన్లలో భద్రతా లోపాలు ఉన్నాయని CERT-In తెలిపింది. ఇవి సెక్యూరిటీ కంట్రోల్స్‌ను బైపాస్ చేసి ఫోన్లు, కంప్యూటర్లలో రిమోట్ అటాకర్స్, సైబర్ క్రిమినల్స్ తమ సొంత కోడ్‌ను జొప్పించేందుకు అవకాశం కల్పిస్తాయంది. మలీషియస్ వెబ్‌సైట్లకు రీడైరెక్ట్ చేసి పర్సనల్ డేటా చోరీకి సాయపడతాయని హెచ్చరించింది.

Similar News

News November 14, 2025

3 చోట్ల ముందంజలో ప్రశాంత్ కిశోర్ పార్టీ

image

బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌కు చెందిన జన్ సురాజ్ పార్టీ 3 చోట్ల ముందంజలో కొనసాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఈ పార్టీ ప్రభావం చూపించదని అంచనా వేశాయి. కీలకమైన స్థానాల్లోనూ ఓట్ల వాటాను దక్కించుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఎఫెక్ట్ మహాగఠ్‌బంధన్‌పై పడే అవకాశం ఉంది. మరోవైపు NDA కూటమి ఎగ్జిట్ పోల్స్ చెప్పిన విధంగా దూసుకెళ్తోంది.

News November 14, 2025

బిహార్: మ్యాజిక్ ఫిగర్ దాటిన NDA

image

బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో NDA దూసుకుపోతోంది. లీడింగ్‌లో ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ 122ను దాటేసింది. ప్రస్తుతం NDA 155, MGB 65, JSP 3స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ప్రధాన పార్టీల వారీగా చూస్తే BJP:78, JDU: 65, RJD:59, కాంగ్రెస్: 11.

News November 14, 2025

పిల్లల్లో ADHDకి మందులు వాడుతున్నారా?

image

కొందరు పిల్లల్లో అటెన్షన్‌ డెఫిసిట్‌ హైపరాక్టివ్‌ డిసీజ్‌ వస్తుంటుంది. అయితే కొందరు వైద్యులు వ్యాధి నిర్ధారణ అవ్వగానే మందులు ఇస్తారు. కానీ ఇది సరికాదంటోంది స్టాన్‌ఫర్డ్‌ మెడిసిన్‌ తాజా అధ్యయనం. ఆరేళ్లలోపు పిల్లల్లో మందులను ప్రాసెస్‌ చేసే మెటబాలిజం పూర్తిగా అభివృద్ధి చెందదు. కాబట్టి మందుల వల్ల ఎలాంటి ప్రయోజనమూ దక్కదు. దానికంటే ముందు వాళ్లకు బిహేవియరల్‌ థెరపీ ఇవ్వాలని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.