News November 26, 2024

Warning: ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా?

image

ఆండ్రాయిడ్ 12- ఆండ్రాయిడ్ 15 వరకు ఆపరేటింగ్ సిస్టమ్స్‌ ఫోన్లను వాడుతున్నవారికి కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఆ ఓఎస్‌లో చాలా లోపాలున్నాయని భారత కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(CERT-In) తేల్చిచెప్పింది. వీటిని హ్యాకర్లు గుర్తిస్తే వినియోగదారుల భద్రతకు తీవ్రస్థాయి ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. అప్‌డేట్స్ రాగానే వెంటనే ఫోన్ అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది.

Similar News

News December 23, 2025

మెస్సీ సోదరికి యాక్సిడెంట్.. తీవ్ర గాయాలు

image

అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ సోదరి మారియా సోల్ మియామిలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి గోడను ఢీకొట్టింది. దీంతో ఆమె శరీరంలో కొంతభాగం కాలిపోవడంతో పాటు వెన్నెముక, మడమ, మణికట్టు వద్ద ఫ్రాక్చర్ అయినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. జనవరి 3న జరగాల్సిన ఆమె పెళ్లి కూడా వాయిదా పడింది. మెస్సీ ఇటీవల భారత్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే.

News December 23, 2025

డిస్కౌంట్‍లో చేనేత వస్త్రాల అమ్మకాలు: సవిత

image

AP: ఈనెల 26నుంచి తిరుపతిలో చేనేత ఎగ్జిబిషన్ ప్రారంభమవుతుందని మంత్రి సవిత తెలిపారు. ’60, 50, 40 శాతాల్లో చేనేత వస్త్రాలపై డిస్కౌంట్లు ఉన్నాయి. గుంటూరు, మంగళగిరిలోని యర్రబాలెంలో 60% డిస్కౌంట్‌తో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశాం. VJAలోని ఆప్కో మెగా షో రూమ్‌లో 50%, మిగిలిన అన్ని షో రూముల్లో 40% డిస్కౌంట్లు ఉన్నాయి. 2 రోజుల్లోగా సహకారసంఘాల నుంచి చేనేత వస్త్రాల కొనుగోళ్లు ప్రారంభమవుతాయి’ అని తెలిపారు.

News December 23, 2025

భాకరాపురంలో జగన్ ప్రజాదర్బార్

image

AP: వైసీపీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి జగన్ పులివెందుల నియోజకవర్గంలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భాకరాపురం క్యాంప్‌ ఆఫీస్‌లో ఆయన ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు, స్థానికులు పెద్దఎత్తున పాల్గొన్నారు. జగన్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రేపు ఉదయం ఇడుపులపాయలో ఆయన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం పులివెందులలో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు.