News April 29, 2024

కేరళ, తమిళనాడు తీరప్రాంతాలకు హెచ్చరికలు

image

కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని తీరప్రాంతాలకు భారత సముద్ర సమాచార సేవల సంస్థ(INCOIS) హెచ్చరికలు జారీ చేసింది. ‘కలక్కడల్ ఫినామినా’ కారణంగా కెరటాలు ఉద్ధృతంగా, ఊహించని రీతిలో విరుచుకుపడతాయని వెల్లడించింది. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, పౌరులు సముద్ర తీరాలకు వెళ్లొద్దని సూచించింది. హిందూ మహాసముద్రంలోని దక్షిణ భాగంలో బలమైన గాలుల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడుతుందని సంస్థ స్పష్టం చేసింది.

Similar News

News October 20, 2025

VJD మెథడ్ అంటే ఏంటి?

image

క్రికెట్ మ్యాచ్‌కు అంతరాయం కలిగినప్పుడు ఓవర్లు కుదించేందుకు, టార్గెట్ రివైజ్ చేసేందుకు డక్‌వర్త్ లూయిస్ స్టెర్న్(DLS) మెథడ్ ఉపయోగించడం తెలిసిందే. దీనికి బదులుగా వి.జయదేవన్ తన పేరుతో <<18055833>>VJD<<>> మెథడ్ కనిపెట్టారు. ఇందులో సాధారణ అంచనాతో పాటు మ్యాచ్ రీస్టార్ట్ అయ్యాక బ్యాటర్లు దూకుడుగా ఆడే అంశాన్నీ పరిగణించి టార్గెట్ సెట్ చేస్తారు. ఓవర్లు, వికెట్లతో పాటు రియల్ మ్యాచ్ కండీషన్స్‌నూ అంచనా వేసేలా డిజైన్ చేశారు.

News October 20, 2025

సదర్ ఉత్సవాల్లో కిషన్‌రెడ్డి సందడి

image

TG: HYD కాచిగూడలోని చప్పల్ బజార్‌లో యాదవుల సదర్ ఉత్సవాల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సందడి చేశారు. ‘ఆల్ ఇండియన్ ఛాంపియన్ బుల్స్’కు స్వాగతం పలికారు. యాదవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతిలో ప్రతి పండుగ పవిత్రమైనదని, దున్న రాజుల ప్రదర్శన అద్భుతమని కొనియాడారు. సమాజంలో ఐక్యత, సాంస్కృతిక గర్వాన్ని ఈ వేడుకలు ప్రదర్శిస్తాయన్నారు. ఈ ఉత్సవాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు.

News October 20, 2025

BREAKING: ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్

image

AP: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు దీపావళి వేళ గుడ్ న్యూస్ చెప్పింది. ఒక డీఏ విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన 3.64% డీఏ 2024 జనవరి 1 నుంచి వర్తించనుంది. ఇటీవల సీఎం చంద్రబాబు ఉద్యోగులతో సమావేశమై ఆర్థిక కారణాల వల్ల ముందుగా ఓ డీఏ నిధులు విడుదల చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.