News January 12, 2025
సంపద మొత్తం ట్రస్టుకు రాసిచ్చిన వారెన్ బఫెట్!

కలియుగ దానకర్ణుడు, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన వారెన్ బఫెట్ తన సంపదను ఓ ఛారిటబుల్ ట్రస్టుకు రాసిచ్చారని తెలిసింది. ఆయన వారసులు సూసీ, హువీ, పీటర్ బఫెట్ దీనిని నిర్వహిస్తారు. నిధులు ఖర్చు చేయాలంటే వీరంతా కలిసే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.. తాము లక్కీ అని, పరులకు సాయం చేసేందుకు అనేక మార్గాలు ఉన్నాయని బఫెట్ అన్నారు. 2006 నుంచి $39B గేట్స్ ఫౌండేషన్కు దానం చేసిన ఆయన ఇకపై ఒక్క $ వారికి ఇవ్వనని చెప్పారు.
Similar News
News January 25, 2026
కేజీ చికెన్ ధర ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు గత వారంతో పోలిస్తే కాస్త తగ్గాయి. హైదరాబాద్లో కేజీ స్కిన్ లెస్ ధర ₹290-300, కామారెడ్డిలో ₹280, వరంగల్లో ₹290గా ఉంది. విశాఖలో ₹280, తిరుపతిలో ₹240-270, నంద్యాలలో ₹240-280 చిత్తూరు, బాపట్ల, గుంటూరులో ₹280-300, విజయవాడలో ₹310-330 వరకు పలుకుతోంది. ఇక కిలో మటన్ ధర ₹800-1000 వరకు ఉంది. మీ ప్రాంతంలో రేట్లు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News January 25, 2026
NHAIలో 40 పోస్టులు.. అప్లై చేశారా?

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI)లో 40 డిప్యూటీ మేనేజర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. బీఈ/బీటెక్(సివిల్) అర్హతగల వారు ఫిబ్రవరి 9 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. గేట్ -2025 స్కోరు ఆధారంగా ఎంపిక చేయనున్నారు. బేసిక్ పే రూ.56,100-రూ.1,77,500గా ఉంది. వెబ్సైట్: https://nhai.gov.in/
News January 25, 2026
ఒంటి కాలిపై నిల్చోగలరా.. ప్రయోజనాలివే

ఒంటి కాలిపై నిల్చోవడాన్ని దినచర్యలో భాగం చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల మరింత బలంగా అవ్వొచ్చని, జ్ఞాపకశక్తి, బ్యాలెన్స్ పెరుగుతుందని అంటున్నారు. ఒక కాలుపై నిలబడి ప్రాక్టీస్ చేసే వారికి కండరాల బలహీనత తగ్గి, పటుత్వం పెరుగుతుందని చెబుతున్నారు. 10 సెకెన్లపాటు అలా నిల్చోలేని మధ్య వయసు వారు ఏడేళ్లలో ఏదో ఒక కారణంతో మరణించే ప్రమాదం 84% ఎక్కువని ఓ స్టడీలో తేలిందని పేర్కొంటున్నారు.


